అన్న క్యాంటీన్ల ను వైసీపీ ప్రభుత్వం కొన్ని చోట్లా రద్దు చేయడంతో ఎంత గొడవ జరిగిందో మనం చూశాము. ప్రతి పక్షాలతో పెద్ద గోల చేశారు. సామాన్య ప్రజలు కూడా తమ అసంతృప్తి ను వ్యక్తం చేశారు. నిజానికి ప్రభుత్వం అన్న క్యాంటీన్ల మూసివేత నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, కొన్ని పధకాల పేర్లు మార్చడం లేదా వాటిని పూర్తిగా రద్దు చేయడం మనం చూస్తూనే ఉన్నాము. జగన్ సర్కార్ కూడా గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికల చివరి కాలంలో అమలు చేసిన కొన్ని పధకాలను రద్దు చేసింది. రైతులకు నేరుగా డబ్బు బదిలీ చేసే అన్నదాత సుఖీభవ కావొచ్చు, లేదా ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి కావొచ్చు.


నిజానికి ఇటువంటి పధకాలను రద్దు చేసినందుకు ఎవరు పెద్దగా భాద పడలేదు. ఆందోళన చెందలేదు. ఎందుకంటే సుఖీభవ పధకానికి బదులు జగన్ కొత్త పధకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి పథకం అమలు చేసే బదులు యువతకు ఉద్యోగాలు కలిపిస్తే సరిపోతుందని జగన్ భావించి గ్రామ సచివాలయాలు అని ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారు. అయితే జగన్ ఎన్ని పథకాలు రద్దు చేసిన పెద్ద వ్యతిరేకత రాలేదని గాని ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అన్న క్యాంటీన్ల  మూసివేత మాత్రం గురించి చాలా మంది నుంచి వ్యతిరేకత వచ్చింది .


అన్న క్యాంటీన్ల పేద ప్రజల ఆకలి తీర్చేవి. ఎటువంటి పధకాలను అమలు చేసిన చేయికపోయిన పేద ప్రజల కడుపును మాత్రం కొట్టకూడదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇలా చేస్తే మాత్రం ఇందుకా గెలిపించింది అని అందరూ అభిప్రాయ పడతారు. నిజానికి అన్న క్యాంటీన్లలో అవినీతి జరిగితే కొత్తవి ఏర్పడే వరకు అయిన వీటిని కొనసాగించాలి. అయితే అన్న క్యాంటీన్ల రద్దు పై వస్తున్న వ్యతిరేకత గమనించిన జగన్ ప్రధాన ఆస్పత్రిలో .. రోగుల కోసం అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో ఆసుపత్రిలో ఎక్కువగా ఉండే ప్రజలకు ఎక్కువగా ఉపయోగ పడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: