వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ట్విట్టర్ లో పదునైన విమర్శలతో ప్రతి పక్షాన్ని ఇరుకున పెట్టగలరు. అయితే వైసీపీ పార్టీ ప్రతి పక్షంలో ఉన్నప్పటి నుంచి విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో రెచ్చిపోయేవారు. అప్పట్లో అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఇంకా చెప్పాలంటే చాలా ఘాటుగా తిట్టేవారు. అయితే ఇప్పుడు తమ పార్టీ అధికారంలో వచ్చిన కూడా విజయ సాయి రెడ్డి పరుష పద జాలంతో టీడీపీ పార్టీ అధినేత అయిన చంద్రబాబును ట్విట్టర్లో దుమ్ముదులుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పులను , బాబుగారికి అండగా నిలబడే పచ్చ మీడియాను సోషల్ మీడియా సాక్షిగా ఆరేస్తున్నారు. 


అయితే కృష్ణ నదికి అనుకున్న చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తుంది. నది పరివాహక ప్రాంతం అయినా లింగమనేని గెస్ట్ హౌస్ చట్ట విరుద్ధమని, సాక్షాత్తు కేంద్ర పర్యావరణ శాఖ కూడా లేఖలో పొందు పరిచింది. అందుకే చంద్రబాబు నివాసానికి అనుకుని ఉన్న ప్రజా వేదికను జగన్ సర్కార్ కూల్చి పడేశారు. అయితే ఇప్పుడు వర్షాలతో, వరదలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతుంది. దీనితో చంద్రబాబు నివాసానికి ముంపు వచ్చింది. 


చంద్రబాబు కూడా అక్కడ ఉండలేక హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి. ఇదే విషయం మీద విజయ సాయి రెడ్డి .. బాబు మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు కష్టం పగవాడికి కూడా రాకూడదని, చంద్రబాబు చేస్తున్న తప్పులకు క్రిష్ణమ్మ ఆగ్రహించి ఇలా బాబుకు కొరడా ఝళిపించిందని ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. బాబు గారు కృష్ణమ్మ ఆగ్రహాన్ని తట్టుకోలేక .. హైదరాబాద్ కు వెళ్లి దాక్కున్నాడని ట్విట్టర్ లో విజయ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. విజయ సాయి రెడ్డి అధికారంలో ఉన్న బాబును మాత్రం వదిలి పెట్టడం లేదని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: