పదవికోల్పోయిన తర్వాత దాదాపు చంద్రబాబు పరిస్దితికి జాలిపడనివారు లేరు.ఇక తెలుగుదేశం తమ్ముళ్ల అవస్దలుచూస్తే అయ్యెపాపం అనిపిస్తుంది. ఈ దశలో కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్ర వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబుకు మధ్య మాటలయుద్దం వాడివేడిగానే సాగుతుంది. ఇకపోతే మాజీముఖ్యమంత్రి చంద్రన్నకు ఇస్తున్న భద్రత విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బాబుకు మింగుడుపడటంలేదు.


ఈ దశలో చంద్రబాబు భద్రతను టూ ప్లస్ టూకి కుదించేసి…ఇవ్వాల్సిన దాని కన్నా ఎక్కువగా ఇస్తున్నామన్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గతంలోలా భద్రత కల్పించాల్సిందేనని ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ పరాజయం తర్వాత  టీడీపీ నేతలెవరికీ ముఖ్యంగా చంద్రబాబుకు భద్రత అవసరం లేదన్నట్లుగా.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యవహరించింది అనే విమర్శలున్నాయి మొదటగా.. ఎస్కార్ట్ వాహనాన్ని..తర్వాత జామర్, రూట్ క్లియరెన్స్ వాహనాన్ని తొలగించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ మినహాయింపు కూడా తొలగించారు. చివరికి… ఆయనకు.. టూ ప్లస్ టూ సెక్యూరిటీని మాత్రమే మిగిల్చారు. 


గతంలో వైఎస్ హయాంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు ప్రస్తుతం జగన్ సీఎం అయిన తర్వాత ఏర్పడిన పరిస్థితులతో ఆందోళన చెందిన టీడీపీ నేతలు.. భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయకూడదన్న కారణంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణలో ఏపీ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా  ప్రతిపక్ష నేతకు 70 మందికిపైగా సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని వాదించింది. కాని ఆ మేరకు ప్రమాణపత్రం దాఖలు చేయలేదు. 


ఈ 70 మందిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వారే అత్యధికంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రం అతి కొద్ది మందే ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించాల్సి వచ్చింది. చంద్రబాబు పర్యటనల్లో ఉన్నప్పుడు ఇతర కార్యక్రమాల్లో ఉన్నప్పుడు.. భద్రత మొత్తం ఏపీ సర్కార్ కేటాయించే భద్రతా సిబ్బందిదే. అయితే.. చంద్రబాబుకు.. ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్నందున.. ఏపీ ప్రభుత్వం తరపున ఎలాంటి భద్రత ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా వాదించారు. కానీ.. ఈ వాదనను ప్రభుత్వం తన తీర్పు ద్వారా తోసిపుచ్చింది. గతంలో కేటాయించినట్లుగా  భద్రత కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అత్యంత సున్నితమైన విషయంలో ప్రభుత్వం ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నా .. రాజకీయంగా టీడీపీ స్థైర్యంపై దెబ్బకొట్టడానికే ప్రభుత్వం ఇలా చేసిందన్న ఆరోపణలు టీడీపీ వైపు నుంచి వచ్చాయి. అయితే మొదటి నుంచి ఏపీ సర్కార్, హైకోర్టుకు 
కూడా ఈ విషయంలో సరైన సమాచారం ఇవ్వలేదు. మరి ఆదేశాలనైనా పాటిస్తుందో లేదోనని టీడీపీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు... 


మరింత సమాచారం తెలుసుకోండి: