సూపర్ స్టార్ మహేష్ బాబు ... సెన్సేషన్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సంగతీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్నాడు. భరత్ అనే నేను సినిమా తరువాత మహర్షి రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు.అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరూ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు. దర్శకుడు అనిల్ రావిపూడి ఎంత స్పీడ్ గా  ఉన్నాడో ! నిజానికి మహర్షి  తరువాత మహేష్ సినిమా  సుకుమార్ తో ఉండాలి. సుకుమార్ కూడా మహేష్ కోసం ఒక స్టోరీ లైన్ వినిపించిన సంగతీ తెలిసిందే.


అయితే ఆ స్టోరీ లైన్ మహేష్ కు నచ్చకపోవడంతో ఆ సినిమాను పక్కన పెట్టేశారు. తరువాత సుకుమార్ వెంటనే అల్లు అర్జున్ తో సినిమాను ప్రకటించడం, తరువాత  మహేష్ — సుకుమార్ వివాదం కొన్ని రోజులు మీడియాలో రావటం అవన్నీ మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం మహేష్ .. అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి వరుస హిట్స్ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. f2 సినిమాతో అందరినీ ఎలా నవ్వించాడో మనం చుశాము.


ఆ సినిమా తరువాత అనిల్ టాలెంట్ తెలుసుకున్న మహేష్ తన నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. దీనితో అనిల్ కు తక్కువ సినిమాలతోనే మహేష్ ను డైరెక్ట్ చేసే అవకాశం పొందాడు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి చేస్తున్న పనులు ప్రిన్స్ అభిమానులకు నచ్చడం లేదు. సినిమా ఎప్పుడో సంక్రాంతికి విడుదల కానుంది. కానీ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనిల్ ప్రతిదీ లీక్ చేశారు. చివరకు షెడ్యూల్ లో షూట్ చేస్తున్న ట్రైన్ సీన్ కూడా చెప్పేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా ట్రైన్ సీన్ లో ఎవరెవరు నటిస్తున్నారో వారందరితో ఫొటోలు దిగి ట్విట్టర్లో  పోస్ట్ చేశారు. ఆ ఆఫోటోలో బండ్ల గణేష్ కూడా ఉండటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: