సోషల్ వెబ్ సైట్ లో రాజకీయ నాయకులు చాలా తక్కువగా ఆశక్తి చూపిస్తుంటారు అని మనకి తెలుసు కానీ మన రాజకీయాల్లో కన్నా టెక్నాజీలో ముందుండే నారా లోకేష్ సోషల్ మీడీయాలో  చాలా యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా జగన్ పై మరోక సంచలన ట్వీట్ చేశారు. జగన్ ను గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకునేలా పాలన ఉండాలి కానీ మీ పాలన ఇన్నాళ్లు మిమ్మల్ని అధికారానికి దూరం పెట్టినందుకు కక్ష సాధింపులా ఉంది అని నారా లోకేష్ విమర్శించారు. నేడు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. జగన్ గారు మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకునేలా ఉండాలి పాలన, కానీ మీ పాలన ఇన్నాళ్లు మిమ్మల్ని అధికారానికి దూరం పెట్టినందుకు కక్ష సాధింపులా ఉంది.


అన్న క్యాంటీన్ ల మూసివేత ఒక్కటి చాలు వెయ్యి పాపాల పెట్టు వాటిని తిరిగి తెరిచి పేదల ఆకలి తీర్చండి చాలు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శుక్రవారం అన్న క్యాంటిన్ ల మూసివేతపై రాజంపేట అన్నా క్యాంటిన్ వద్ద భారీ ధర్నా నిర్వహించటానికి పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి.




మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఉన్నత ఆశయంతో దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రధానంగా బలహీన బడుగు వర్గాల వారికి కూలీలకు రోజువారి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో అన్న క్యాంటీన్ ను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్మోహనరెడ్డి వాటిని మూసివేయడం దారుణమన్నారు. నియోజక వర్గంలోని తెలుగు దేశం పార్టీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.




మరింత సమాచారం తెలుసుకోండి: