అత్యాచారానికి గురైన స్నేహిత అనే పసిపాప మరణం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది.ఇక స్నేహిత బాధనుండి పుట్టిన ఈ జటాయువు ఆర్మీ రూపకల్పన ఆ పసిపాప తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిందని సీఎస్ రంగరాజన్ గారు తెలిపారు.చిలుకూరు బాలాజి ఆశీస్సులతో పుట్టిన చిన్నారిని అత్యంత పాశవికంగా చంపాడు ఓ కామాంధుడు.ఈ కేసులో దోషిని కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రంలో చాలా చోట్ల ఆందోళన ప్రదర్శనలు కూడా జరిగాయి.అయినా అత్యాచారాల పర్వం ఆగలేదు.ఇకనైన చిన్నారులపై గాని మహిళలపై కాని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఈ జటాయువు సైన్యం రక్షిస్తుందని,మానవత్వం వున్న ప్రతివారు ఈ దళంలో సైనికుల్లా పనిచేయాలని రంగరాజన్ గారు పిలుపునిచ్చారు..
ఇక ఈ జటాయువు ఆలోచనను సమాజం ఎలా స్వీకరిస్తుందోనని కాస్త ఆందోళన పడ్డాం ఆ దశలో సౌందరరాజన్ సలహాతో ప్రతిరోజు ఆలయంలోకి వచ్చే భక్తులకు జటాయువు పోరాటం గురించి చెబుతూ వచ్చామని దాంతో యువతలో క్రమక్రమంగా చైతన్యం పెరిగిందని రంగరాజన్ చెప్పుకొచ్చారు.ఆడపిల్లలకు రక్షణగా సమాజం మొత్తం నిలబడాలని అప్పుడే కోరుకున్న మార్పు జరుగుతుందని ఆయన విన్నవించారు.రామాయణంలో సీతను ఎత్తుకెళ్తున్న రావణుడితో పోరాడిన జటాయువుగా ప్రతి ఒక్కరుమారాలని కలుషితమైన ఈ మనషుల మనసులనుండి ఆడపిల్లలను కాపాడాలంటే లక్షలకొలది జటాయువు రక్షకులు కావాలని పిలుపునిచ్చారు...