కర్ణాటకలో కాంగ్రెస్  జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి .. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇంత వరకు మంత్రి వర్గ ఏర్పాటు పూర్తి కాలేదు.  కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చడానికి కొంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతీ తెలిసిందే. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. కొంత మంది ఎమ్మెల్యేలు ను స్పీకర్ అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే బల పరీక్షలో నెగ్గిన బీజేపీ .. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వానికి పట్టిన గతి తమకు కూడా పడుతుందని బీజేపీ ఇప్పుడు భయపడుతుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయాలి.


అయితే ఇంత వరకు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు. ఎక్కడ అసంతృప్తి ఎమ్మెల్యేలు మళ్ళీ తిరుగుబాటు చేసి కాంగ్రెస్ గూటికి చేరుతారేమోనని యెడ్యూరప్ప సర్కార్ కు ఇప్పుడు ఆ భయం పట్టుకుంది.  అయితే తిరుబాటు చేసిన ఫర్వాలేదు గాని ఒక వేళ ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. దీనితో యెడ్యూరప్ప ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి.


అయితే మంత్రి వర్గ సమయంలో సుమారు 7 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని సమాచారం వచ్చిందంటా .. దీనితో మంత్రి వర్గ విస్తరణ బీజేపీకి కత్తి మీద సాము లాగా తయారైందటా .. ఇదే విధంగా కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూలి పోవటంతో ఇప్పుడు బీజేపీ వెన్నులో వణుకు పుడుతుంది. అయితే అమిత్ షా .. యెడ్యూరప్ప ఫైనల్ చేసిన మంత్రి వర్గ లిస్ట్ ను ఇంకా ఆమోదించ లేదు. భేటీ కూడా వాయిదా పడింది. యెడ్యూరప్ప ఫైనల్ చేసిన లిస్ట్ అమిత్ షా కు నచ్చలేదని తెలుస్తుంది. పైగా ఆశావాహుకులు ఎక్కువగా ఉండటంతో అమిత్ షా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: