రాష్ట్రం లో వర్షాల వల్ల వరద ఉదృతి పెరిగిపోయింది. చాలా గ్రామాలు వరద భీబత్సం వల్ల నాశనమయ్యాయి. కొన్ని లక్ష్గల ఎకరాల పంట నాశనమయ్యింది. ఇటు వంటి పరిస్తితుల లో ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన పై చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు. 


రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కన్నా లక్ష్మీ నారాయణ ఈ విషయం‌ పై ఘాటుగా స్పందించారు. అటు జగన్ పై మాత్రమే కాకుండా మాజీ ముస్క్య మంత్రి చంద్రబాబు నాయుడు పై కూడా విమర్శ అస్త్రాన్ని సందించారు. గత ఐదేళ్ళు పాలించిన చంద్ర బాబు కూడా వరడ సమయం లో తన ఇళ్ళు నీట మునుగిన కారణంగా ఇక్కడ ఉండకుందా హైదరబాద్ కి వెల్లారంటూ ట్విట్టర్ వేదిక పై విమర్శలు చేశారు.


టిడిపి వైసిపి రెండూ రెండే నంటూ మరొసారి విమర్శించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాష్ట్రాన్ని ఓ వైపు వరదలు ముంచెత్తుతుంటే సీఎం అమెరికా పర్యటన కు వెళ్లడం ఏంటి అన్నారు ఆయన. గత ఐదు సంవత్సరాలు పాలించి  రాష్ట్రం మొత్తం అప్పుల్లో ముంచిన చంద్రబాబు తన నివాసం మునగడం తో ఇప్పుడు చల్లగా హైదరాబాద్ జారుకుంటున్నారని ట్వీట్ చేశారు కన్నా. 



మరింత సమాచారం తెలుసుకోండి: