ఏపీలో రాజకీయాల్లో పోలవరం ఇప్పుడు హాట్ డిబేట్ గా మారింది. పోలవరం పనులకు తిరిగి టెండరింగ్ ఇవ్వటం కోసం వైసీపీ సర్వం రంగం సిద్ధం చేసింది. అయితే దీనికి పోలవరం అధారిటీ ( కేంద్ర జల వనరుల శాఖ ) తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ టెండరింగ్ కు వెళ్లాల్సిన పని లేదని ఇది సమయం వృధా పని అని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రీటెండరింగ్ కు వెళ్ళాలిసిందేనని చెబుతున్నారు. ఇప్పటికే రీటెండరింగ్ కు సంభందించి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం పోలవరం విషయంలో కొన్ని రోజుల క్రితం కాంట్రాక్టు పనుల నుంచి నవయుగ కంపెనీను రద్దు చేసిన సంగతీ తెలిసిందే.


పోలవరంలో పెద్ద అవినీతి జరిగిందని ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ పలు సార్లు చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి పోలవరంలో జరిగిన అవకతవకలు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరంలో జరిగిన అవినీతి పై ఒక కమిటీని కూడా జగన్ నియమించారు. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలవరం పనులు నిలిపేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. పోలవరం నిర్మాణాన్ని చేపట్టిన నవయుగ కంపెనీకి ఏపీ ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ ఇచ్చినట్టు సమాచారం.


జగన్ ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనల మేరకు ఈ కంపెనీని తప్పుకోమని ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల కొంత మంది ఆందోళను వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలవరం పనులు ఎట్టి పరిస్థితిలో లేటు కాకూడదని జగన్ ప్రభుత్వం వెంటనే టెండరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ప్రభుత్వం కోట్ చేసిన ధర కంటే తక్కువలో ఏ కంపెనీ అయినా ముందుకు వస్తే ఆ కంపెనీకి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: