అవును ఈ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న ఆత్మహత్య చేసుకోవటానికి సిద్దంగా ఉన్నట్లు ఆయనే చెబుతున్నారు. అదికూడా ఎక్కడో కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే చేసుకుంటారట. ఇంతకీ బుద్ధా ఆత్మహత్య అంశం ఎందుకు వచ్చిందంటే తమ నేత చంద్రబాబునాయుడు హత్యకు జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారట.  ఆ కుట్రలను గనుక మానుకోకపోతే జగన్ ఇంటి ముందే తాను ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. చూడబోతే ఇది కూడా ఒకరకమైన బ్లాక్ మెయిల్ గానే అనిపిస్తోంది.

 

అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ ప్రభుత్వం చంద్రబాబు హత్యకు ఓ పద్దతి ప్రకారం కుట్రలు, కుతంత్రాలు చేస్తోందంటూ మండిపోయారు. జడ్ ప్లస్ లో ఉన్న చంద్రబాబుకు భద్రత తగ్గించటం ఇందులో భాగమే అంటున్నారు ఎంఎల్సీ. నిజానికి చంద్రబాబు భద్రత తగ్గించలేదని ప్రభుత్వం కోర్టులోనే చెప్పింది. ప్రస్తుతం చంద్రబాబుకున్న భద్రతను కోర్టు  పరిశీలించిన తర్వాత ఉన్న భద్రతనే కంటిన్యు చేయమని చెప్పింది. అంటే అర్ధం ఏమిటి ? భద్రతను ఎక్కడా తగ్గించలేదనే కదా ? అయినా సరే చంద్రబాబుకు భద్రత తగ్గించేశారంటూ ఒకటే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.

 

తమ అధినేతను కాపాడుకోవటానికి తాను చావటానికి కూడా సిద్దంగా ఉన్నట్లు బుద్ధా హెచ్చరించటమే విచిత్రంగా ఉంది. జడ్ ప్లస్ సెక్యురిటి ఉన్న చంద్రబాబు ఇంటిమీద ద్రోన్లను ఎగరేయటమేంటి ? అంటూ మండిపోవటమే విచిత్రంగా ఉంది.  మిగిలిన ప్రాంతాలను వదిలేసి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటి దగ్గరకు మంత్రులు, ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెక్కీ చేసినట్లుగా వెళ్ళటమే తప్పన్నట్లుగా ఎంఎల్సీ మాట్లాడుతున్నారు.

 

అక్రమ నివాసంలో చంద్రబాబు ఉండటం తప్పు కాదట. వరద ముంపు విషయాన్ని పరిశీలించటానికి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు ఇంటికి వెళ్ళటమే మంత్రులు, ఎంఎల్ఏ చేసిన తప్పంటున్నారు. మొత్తానికి చంద్రబాబును ప్రభుత్వం టార్టెట్ చేసినట్లు అర్ధమైపోతోందని బుద్ధా సూత్రీకరించేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: