భారతదేశంలో ఆడపిల్లగా పుట్టడమే శాపంగా మారే రోజులు దాపురించాయి. బాలికలు, మహిళలపై వేధింపులు, దాడులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలను తమ సొత్తుగా పురుష పుంగవులు భావించే భావజాలం నుంచి బయటపడకపోవడం వల్లే దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఒకటా రెండా.. ఉదయం పత్రిక తెరవగానే ఇలాంటి వార్తలు కనిపించనిరోజు ఉండటం లేదు.


తాజాగా ఏంజరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్ లో కొందరు పోకిరీలు అరాచకానికి ఒడిగట్టారు. బడికి వెళ్లి వస్తున్న ఓ బాలికను అతి కిరాతకంగా చంపేశాడు.. ఇంతకీ ఆమె చేసిన పాపం ఏంటంటే.. వారి వేధిస్తుంటే నోరు మూసుకోకుండా ఉండటమే.. మాటలతో హింసిస్తున్నా .. మౌనంగా భరించకపోవడమే.. సుల్తాన్‌పుర్‌లో ముగ్గురు దుండగులు ఓ బాలికను వెంటాడి వేధించారు.


పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి తిరిగి వెళుతున్న బాలికను అదే సమయంలో అటుగా బైక్‌ మీద వస్తున్న ముగ్గురు పోకిరీలు వేధించడం మొదలు పెట్టారు.అసభ్య పదజాలంతో సతాయించడం ప్రారంభించారు. కొంతసేపు వారి మాటలు భరించిన ఆ బాలిక ఆ తర్వాత.. ఇక లాభం లేదనుకుని పెద్దగా కేకలు వేసింది. అంతే చుట్టూజనం పోగయ్యారు. వారికి బుద్ది చెప్పారు. ఈ ఘటనతో వారు అవమానంగా ఫీలయ్యారు. తమను ఇంతగా అవమానిస్తుందా అని కోపంతో రగిలిపోయారు.


వెళ్లిపోయిన కొద్దిసేపటికే మళ్లీ వెనక్కి వచ్చారు.. ఇద్దరు ఆమెను కదలకుండా నేలపై పడుకోబెట్టాడు. ఇంకొకడు ఆమె తల మీదుగా బండి పోనిచ్చాడు. దాంతో బాలిక తీవ్రంగా గాయాలపాలైంది. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి.. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆ బాలిక మరణించింది. పోకిరీలు ఆమె మరణానికి కారణమైతే.. పోలీసులు, వైద్యులు కూడా సకాలంలో స్పందించలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించారట. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయనని ప్రభుత్వ డాక్టర్లు చేతులెత్తేశారట.


మరింత సమాచారం తెలుసుకోండి: