ఏపీ ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో ఏం చేస్తున్నారని చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. ఒక పక్క ఏపీలో వరదలు వస్తుంటే బాబు గారు మాత్రం హైదరాబాద్ లో మకాం వేశారు. దీనితో అధికార పార్టీకి బాబు టార్గెట్ అయ్యారు. కృష్ణా నది వరదలో తన ఇల్లు చిక్కుకుపోవటంతో చేసేదేమి లేక హైదరాబాద్ ఇంటికి తన మకాం మార్చారు. ప్రతి పక్షంలో జగన్ హైదరాబాద్ ఉన్నప్పుడు .. టీడీపీ నాయకులూ గాని , చంద్రబాబు గాని జగన్ ను పదే పదే విమర్శించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. జగన్ ఇప్పుడు ఏపీ సీఎంగా రాజధానిలోకి స్వంతంగా ఇల్లు కట్టుకున్నారు. కానీ బాబు గారు మాత్రం రాజధానిలో ఒక్క సెంటు ఇల్లు కూడా కొన లేదు. 


ఇప్పటీకే ఇదే విషయం మీద అధికార పార్టీ మంత్రులు వ్యంగ్యంగా స్పందించిన సంగతీ తెలిసిందే.  ఇప్పటీకే చంద్రబాబుకు ఇల్లు కావాలంటే ఇస్తామని ఆళ్ల రామకృష్ణ రెడ్డి చెప్పిన సంగతీ తెలిసిందే. సిగ్గులేకుండా ఇంకా అక్రమ కట్టడంలో ఉంటూ టీడీపీ నేతలు దిగజారి పోతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కూడా ఇల్లు కోసం ధరఖాస్తు చేసుకుంటే .. ప్రజలతో పాటు ఆయనకు కూడా వచ్చే ఉగాది లోపల ఇల్లు పట్టాను ఇస్తామని వ్యగ్యంగా సమాధానం చెప్పిన సంగతీ తెలిసిందే . 


అయితే ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి, తెలంగాణలో టీడీపీని బతికిస్తాడంటా .. తెలంగాణ నేతలంతో నిత్యం టచ్ లో ఉంటానని ఆ మధ్య స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతీ తెలిసిందే. అయితే ఏపీలో కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీడీపీ .. ఎప్పుడో తెలంగాణ లో ఖాళీ అయిన టీడీపీ మీద ద్రుష్టి పెట్టడం ఇప్పుడు విడ్డురంగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి మనం చూశాము. ఇక పార్లమెంట్ ఎన్నికలో అయితే అసలు పోటీనే చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: