ఎప్పటి కీ నరేంద్ర మోడీ దేశ ప్రధాని

 వచ్చే  కొన్ని దశాబ్దాల పాటు శ్రీ  నరేంద్ర మోడీ మినహా మరి నాయకుడు ప్రధాని  కాలేడని భారతీయ జనతా పార్టీ తప్ప మరి పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టలేదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జోస్యం చెప్పారు.  సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీ ప్రమోద్ సావంత్ మాట్లాడారు.

 దేశానికి బిజెపి  తప్ప మరి ఏ ఇతర పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేదని,  మరే ఇతర పార్టీతో కూడా భారతదేశం అభివృద్ధి సాధించలేదని శ్రీ  ప్రమోద్ సావంత్ అన్నారు. తన అద్భుతమైన పనితీరుతో నరేంద్ర మోడీ సారథ్యం లో  భారతీయ జనతా పార్టీ కేంద్రం లో ప్రగతి పథంలో దూసుకు పోతోంది అని ఆ పరుగు ఆపడం ఎవరి తరం కాదని  ప్రమోద్ సావంత్ తెలిపారు. దేశ ప్రజల సంపూర్ణ విశ్వాసం వల్ల ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. దేశ ప్రజల బంగారు భవితకు బాటలు వేసే ఎన్నో ఉత్తమోత్తమమైన పథకాలను నరేంద్ర మోడీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ తీసుకు వస్తుంద ని ఆయన తెలిపారు

రాష్ట్రం లో జరిగిన నా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం  లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అని, రాష్ట్ర ప్రజల నుంచి ఊహించని అటువంటి విశేషమైన స్పందన లభిస్తోందని ఈ కార్యక్రమంలో శ్రీ ప్రమోద్ సావంత్ తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: