గత రాత్రి భారీ వర్షాలు కురవడంతో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్ర రహదారులతో పాటు నేషనల్ హైవేలు కూడా పూర్తిగా స్తంభించాయి. కిన్నౌర్ లో అయిదో నెంబరు జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఉత్తర కాశీలో టోన్స్ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పరివాహక ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరకాశి వరదలకు పదిహెడు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఇరవై నాలుగు మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు.
గత రాత్రి భారీ వర్షాలు కురవడంతో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్ర రహదారులతో పాటు నేషనల్ హైవేలు కూడా పూర్తిగా స్తంభించాయి. కిన్నౌర్ లో అయిదో నెంబరు జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఉత్తర కాశీలో టోన్స్ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పరివాహక ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరకాశి వరదలకు పదిహెడు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఇరవై నాలుగు మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు.