ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి బాబుగారు అలాగే ఆయనగారి ఎల్లో మీడియా సర్వ శక్తులు ఒడ్డుతుంటే.. ఒకపక్క ఓటమి పాలైన వారంతా ఇతర పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీనీ వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతున్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులతో మొదలైన ఈ వలసలు పరంపర ఇప్పట్లో ఆగేలా లేదు. గత రెండు రోజుల నుంచీ టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని బీజేపీ గూటికి చేరబోతున్నట్లు.. ఈ క్రమంలోనే ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారని.. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమెతో పాటు మరికొందరు నేతలు కూడా టీడీపీనీ వీడి బీజేపీలో చేరాలని చూస్తున్నారట. వారిలో ప్రధానంగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో దూకుడు పెంచుతోంది బీజేపీ. ఆపరేషన్ ఆకర్ష్ తో రెండు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. అందుకే ఇప్పుడు ఈ వలసలు మొదలయ్యాయి.
మరో పక్క ఇప్పుడు ఉన్నవారిని ఎక్కడకి పోనివ్వకుండా చూసుకోవడం చంద్రబాబు తలకు మించిన భారం అవుతుంది. ఇదిలా ఉండగా జగన్ దెబ్బకు ఇక తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా భూస్థాపితం అయ్యిపోతుందని అంతా అనుకుంటున్నా తరుణంలో ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఈ పార్టీను ఎలా అయినా సరే మళ్ళీ పూర్వ స్థితికి తీసుకురావాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే జగన్ ప్రభుత్వం పై తమ గళాన్ని బలంగా వినిపించడం అలాగే నారా లోకేష్ ను రాజకీయాల్లో మరింత బలంగా తయారు చేసే దిశగా అడుగులు వేయిస్తూ ప్రత్యర్ధ పార్టీ పై విమర్శలు చేయిస్తున్నారు. దీనికి తోడు తన సోకాల్డ్ ఎల్లో మీడియా ఛానెళ్ల ద్వారా.. నిస్సహాయత పరిస్థితుల్లో కూడా చంద్రబాబు తాను ఒక్కడై పార్టీను నడిపిస్తూ ఉంటే.. వైసీపీ మాత్రం తనని తన ఇంటినీ మాత్రమే కార్నర్ చేసేసారు' అన్నట్టుగా ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తన పై టీడీపీ పార్టీ పై ప్రజల్లో ఒక సింపతీని తీసుకొచ్చే ప్రయత్నం ఈ మధ్య కాస్త బాగానే జరుగుతుంది. మరి మన బాబుగారి విశ్వ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి. అన్నిటికి మించి నాయకులు పార్టీని వదిలి పోకుండా బాబు ఆపాలి. మరి ఆపడమెలా ?