సమాజంలో నైతిక విలువలు  రోజురోజుకు దిగజారుతున్నాయనడానికి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి కామంతో క‌ళ్లు మూసుకుపోయి త‌న, మ‌న అన్న తేడా లేకుండా పైశాచికంగా ప్ర‌వ‌ర్తించాడు. ఓ తండ్రి కామంతో క‌ళ్లు మూసుకుపోయి ఏకంగా త‌న కుమార్తెల‌పైనే అత్యాచారం చేస్తున్నాడు. ఇది కేవలం ఒక్కరోజు, రెండు రోజులు జరిగిన ఘటన కాదు. ఏకంగా 15 సంవత్సరాలపాటు కొనసాగింది. 


ఈ ఘోరాతి ఘోర‌మైన సంఘ‌ట‌న‌లో మ‌రో ట్విస్ట్ ఏంటంటే బాధితురాలి తల్లి కూడా భర్తకే మద్దతు తెలపడం  మరింత ఘోరం. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. లక్నోకు చెందిన ఓ యువతి (21) తనపై తండ్రి 15 సంవత్సరాల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అమానుష సంఘ‌ట‌న‌లో కేవ‌లం 6 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న బాధితురాలి చెల్లిని కూడా తండ్రి అత్యాచారం చేశాడ‌ని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 


ఈ లైంగీక వేధింపులు ఆగ‌క‌పోవ‌డంతో బాధితురాలు ఓ స్వ‌చ్ఛంద సంస్థ ద్వారా పోలీసుల‌ను ఆశ్ర‌యించి త‌న తండ్రిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తన సోదరిని ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చింది. ఇంట్లో జరుగుతుందంతా త‌న త‌ల్లికి కూడా తెలుస‌ని చెప్పిన ఆమె.. త‌న త‌ల్లి కూడా తండ్రికే స‌హ‌క‌రిస్తోంద‌ని వాపోయింది. 


త‌న‌కు గర్భనిరోధక మాత్రలు ఇచ్చేదని పోలీసుల ఎదుట వాపోయింది. దీంతో లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం(పోక్సో)2012 కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, ప్రస్తుతం బాధితురాలి తల్లిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
ఈ సంఘ‌ట‌న‌పై యూపీ వ్యాప్తంగా ఉన్న మ‌హిళా సంఘాల నేత‌లు మండి పడుతున్నారు. నిందితుడిని వెంట‌నే అరెస్టు చేయాల‌ని... బాధిత బాలిక‌తో పాటు ఆమె చెల్లికి న్యాయం చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: