ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోరమైన ఓటమిని చవి చూసిన ఇంకా పార్టీ మారినట్టు కనిపించడం లేదు. చంద్రబాబు ఇంటి ముందు డ్రోన్ ఎగిరినందుకు ఎగిరెగిరి పడుతున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబును చంపించడానికే డ్రోన్ ను జగన్ సెట్ చేశాడని .. జగన్ నే ముద్దాయిని చేయాలనీ అంటున్నారు. అచ్చెన్నాయుడు, మరి కొంత మంది టీడీపీ నేతలు. ఇంత కంటే సిగ్గుమాలిన మాటలు ఇంకెక్కడైనా ఉంటాయా ? జగన్ అధికారంలోకి వచ్చి, కనీసం మూడునెలలు కూడా కాలేదు. అప్పుడే ప్రతి విషయంలో నానా యాగీ చేస్తున్నారు. నిజానికి టీడీపీ ఆపార్టీకి ఉన్న వీక్ నెస్ అది. అయిన దానికి కాని దానికి బోడి గుండెకు .. మోకాళ్ళకు ముడి పెట్టడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య.


చంద్రబాబు ఏమో ఒక పక్క నాకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతా కల్పించడం లేదని కోర్ట్ కు వెళతారు. ప్రభుత్వం .. చంద్రబాబు ఇల్లుకు భద్రతా కల్పించే ఉద్దేశంతో డ్రోన్లను ఉపయోగిస్తే, దానిని కూడా రాజకీయం చేయడం ఒక్క చంద్రబాబుకే దక్కింది. అయితే కృష్ణ నదికి అనుకున్న చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తుంది. నది పరివాహక ప్రాంతం అయినా లింగమనేని గెస్ట్ హౌస్ చట్ట విరుద్ధమని, సాక్షాత్తు కేంద్ర పర్యావరణ శాఖ కూడా లేఖలో పొందు పరిచింది.


అయితే కృష్ణా నది వరద ఎక్కువ అవ్వటం చేత ఏపీ ప్రభుత్వం డ్రోన్లను ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వరద ముప్పుతో ఉన్న చంద్రబాబు ఇల్లును డ్రోన్లతో నిఘాలో పెట్టడమే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పు. సాధారణ ప్రజలను ఎలాగైతే కాపాడాలో.. రాష్ట్ర ప్రతి పక్ష నేత అయిన చంద్రబాబును అలాగే కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వానిది. కానీ దానిని కూడా తప్పు అనే స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులూ. తప్పు కూడా కాదు .. జగనే .. చంద్రబాబును చంపించాలని చూశాడని నీతి లేని రాజకీయం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇంత జరిగిన .. చివరికి ప్రజలు ఛీ కొట్టి మూడు నెలలు కాకా ముందే ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: