ప్రస్తుతం ప్రతి పక్షంలో కూర్చోని ఉన్న టీడీపీ పార్టీ నాయకులు అర్ధం పర్ధం లేని ఆరోపణలతో ఉన్న పరువును పోగొట్టుకుంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అతని పుత్ర రత్నం ఇద్దరు ట్విట్టర్లో చేస్తున్న హంగామా ఎంత తక్కువగా చెబితే అంత మేలు. జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. ట్విట్టర్ లో ఒకరు మించి ఒకరు కామెడీని పండిస్తున్నారు. వీరు చేస్తున్న పనులు మైలేజీ తీసుకురావటం కాదు కదా జనాల్లో కమెడియన్స్  గా మార్చెస్తున్నాయి. ప్రజా వేదిక విషయంలో సింపతీని పొందాలని చూశారు కానీ అక్కడ కూడా సెల్ఫ్ గోల్ అయ్యింది. అక్రమ కట్టడం కూల్చడం కరెక్టే కదా అని మెజారిటీ జనాలు ఒప్పుకున్నారు.

అయితే ఇప్పుడు డ్రోన్ల మీద రాజకీయం చేయాలనీ చూశారు కానీ అది కూడా బెడిసి కొట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ప్రతి పక్ష హోదాకు పరిమితం అవ్వటంతో అధికార పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడతూ చంద్రబాబు అనిపించుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి, కనీసం మూడునెలలు కూడా కాలేదు. అప్పుడే ప్రతి విషయంలో నానా యాగీ చేస్తున్నారు. నిజానికి టీడీపీ ఆపార్టీకి ఉన్న వీక్ నెస్ అది. అయిన దానికి కాని దానికి బోడి గుండెకు .. మోకాళ్ళకు ముడి పెట్టడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య.


అయితే ఇప్పుడేమో ఏకంగా గవర్నర్ దగ్గరికి వెళ్లి ఇంకా చీప్ గా ప్రవర్తిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని ఎక్కువగా రిలీజ్ చేసి మరీ చంద్రబాబు ఇంటిని వరదలో ముంచాలని వైసీపీ అనుకున్నదని .. టీడీపీ నేతలు గవర్నర్ కు విన్నవించుకున్నారు. ఇది వినడానికే విడ్డురంగా ఉంటే, వీళ్ళు మాత్రం ఏకంగా ఇదే విషయాన్ని గవర్నర్ కు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిని గవర్నర్ కు చెప్పి జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొచ్చు. కానీ అలా చేస్తే వీరు టీడీపీ నాయకులు ఎందుకు అవుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: