అయితే ఇప్పుడు డ్రోన్ల మీద రాజకీయం చేయాలనీ చూశారు కానీ అది కూడా బెడిసి కొట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ప్రతి పక్ష హోదాకు పరిమితం అవ్వటంతో అధికార పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడతూ చంద్రబాబు అనిపించుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి, కనీసం మూడునెలలు కూడా కాలేదు. అప్పుడే ప్రతి విషయంలో నానా యాగీ చేస్తున్నారు. నిజానికి టీడీపీ ఆపార్టీకి ఉన్న వీక్ నెస్ అది. అయిన దానికి కాని దానికి బోడి గుండెకు .. మోకాళ్ళకు ముడి పెట్టడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య.
అయితే ఇప్పుడేమో ఏకంగా గవర్నర్ దగ్గరికి వెళ్లి ఇంకా చీప్ గా ప్రవర్తిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని ఎక్కువగా రిలీజ్ చేసి మరీ చంద్రబాబు ఇంటిని వరదలో ముంచాలని వైసీపీ అనుకున్నదని .. టీడీపీ నేతలు గవర్నర్ కు విన్నవించుకున్నారు. ఇది వినడానికే విడ్డురంగా ఉంటే, వీళ్ళు మాత్రం ఏకంగా ఇదే విషయాన్ని గవర్నర్ కు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిని గవర్నర్ కు చెప్పి జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొచ్చు. కానీ అలా చేస్తే వీరు టీడీపీ నాయకులు ఎందుకు అవుతారు.