జగన్ కేవలం పాలనా మాత్రమే చేయకుండా తన ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవినీతి జరగకుండా దానిని అరికట్టేందుకు తన స్వంత నేతలను కంట్రోల్ లో పెట్టేందుకు ఇంటెలిజెంట్ వ్యవస్థను ఇంకా పటిష్టం చేశారు. దీనితో ఎక్కడ ఏ సెటిల్మెంట్ లో అయినా మంత్రులు తల దూరిస్తే జగన్ దగ్గరకి సమాచారం వచ్చేస్తుంది. నిజానికి  ఈ విషయంలో జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఏ రాష్ట్రంలో సీఎం కూడా తన స్వంత నేతల పై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు నివేదికలు తెచ్చుకోరు. కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారిగా ఉండాలని ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు. 


రాష్ట్రంలో అవినీతి ఏ రూపంలో ఉన్న అసలు క్షమించనని, సమూలంగా ప్రక్షాళన చేస్తానని చెప్పారు. దేశంలోనే ఏపీ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా మారుస్తానని ఇప్పటికే పదే పదే చెప్పారు. దానికి తగ్గట్టుగా ఎన్నో చర్యలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమమే దిశగా తన పాలన ఉంటుందని .. తన ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటీకే ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా కాంట్రాక్టు పనులు అత్యంత పారదర్శకంగా ఉండేందుకు జ్యూడిషల్ కమీషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ తీసుకువస్తున్నారు.


అదే సమయంలో జగన్ .. తన మంత్రి వర్గానికి గట్టిగ హెచ్చరికలు చేశారు తన ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే నెక్స్ట్ మినిట్ క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని చెప్పారు. ఇప్పటికే ఒక సెటిల్ మెంట్ లో దొరికిపోయిన మంత్రిని హెచ్చరించారు. ఇంకా చెప్పాలంటే జగన్ తన మంత్రులు కూడా ఎక్కడ అవినీతిలో ఉండకుండా వారికి గట్టిగా హెచ్చరికలు చేశారు. వారిని నిరంతరం కనిపెట్టేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: