వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రీటెండరింగ్ పనులు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటీకే రీటెండరింగ్ పనులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం ఇప్పుడు ఆసక్తిగా కరంగా మారింది. అయితే ఇప్పటికే పోలవరం పనులు లేట్ అయినాయని .. మళ్ళీ ఇంకాజ్ జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే ఇప్పుడు నవయుగ కంపెనీ .. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తే కోర్ట్ మెట్టులు ఎక్కింది.
అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల పోలవరం అధారిటీ ( కేంద్ర జల వనరుల శాఖ ) తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ టెండరింగ్ కు వెళ్లాల్సిన పని లేదని ఇది సమయం వృధా పని అని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రీటెండరింగ్ కు వెళ్ళాలిసిందేనని చెబుతున్నారు. ఇప్పటికే రీటెండరింగ్ కు సంభందించి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.