ఏపీలో ఎప్పుడు చూసినా పోలవరం ఏదో ఒక రూపేణా వార్తల్లో నిలుస్తుంది. కొత్తగా ముఖ్యమంత్రిగా భాద్యతలు చేప్పట్టిన జగన్ .. ప్రస్తుతం పోలవరం కాంట్రాక్టు పనులు చేస్తున్న నవయుగ కంపెనీకి టెర్మినేషన్ లెటర్ ఇచ్చి కాంట్రాక్టు పనులను రద్ధు చేసిన సంగతీ తెలిసిందే. అయితే నవయుగ కంపెనీ ఇప్పుడు కోర్ట్ కు వెళ్ళింది. నవయుగ కంపెనీ అవినీతికి పాల్పడినట్టు ..  ప్రభుత్వం నిరూపించాలి. లేదా పోలవరం పనుల్లో  నాణ్యత లోపించిందని ప్రభుత్వం తేల్చాలి. ఆలా చేయని పక్షంలో కోర్ట్ లో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పనులు చేబడుతున్న నవయుగ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం టెర్మినేషన్ లెటర్ ఎప్పుడో ఇచ్చింది.


వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రీటెండరింగ్ పనులు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటీకే రీటెండరింగ్ పనులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం ఇప్పుడు ఆసక్తిగా కరంగా మారింది. అయితే ఇప్పటికే పోలవరం పనులు లేట్ అయినాయని .. మళ్ళీ ఇంకాజ్ జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే ఇప్పుడు నవయుగ కంపెనీ .. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తే కోర్ట్ మెట్టులు ఎక్కింది.


అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల పోలవరం అధారిటీ ( కేంద్ర జల వనరుల శాఖ ) తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ టెండరింగ్ కు వెళ్లాల్సిన పని లేదని ఇది సమయం వృధా పని అని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రీటెండరింగ్ కు వెళ్ళాలిసిందేనని చెబుతున్నారు. ఇప్పటికే రీటెండరింగ్ కు సంభందించి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: