చిన్నారులపై అత్యాచారాలు అని ఈ మధ్య మనందరం వింటున్న న్యూస్.నిజంగా మనిషిలో కామప్రవృత్తి పెరిగితే ఇంత రాక్షాసుడిలా మారుతాడ అనిపించే సంఘటనలు ఈ మధ్యకాలంలో చాల జరుగుతున్నాయి..వావివరసలు మరచి ప్రవర్తిస్తూన్నారు మగాళ్లు అని చెప్పుకునే మృగాళ్లు,అంతేకాకుండా ముక్కుపచ్చలారని చిన్నపిల్లల్ని కూడా వదలడంలేదు. అమాయకపు చూపులతో ఆడుకునే వారికి ఏం తెలుసు ఈ సమాజంలో ఆడపిల్లలా పుట్టడం తాము చేసిన పాపమని.




ఓ చాక్లెట్ ఇస్తే ప్రేమగా దగ్గరికెళతారు,కాని వాడు చూపే ప్రేమలో కోరికతో కూడిన విషముందని వాడి ఒంట్లో కామంతో కూడిన కొరలు పెరిగాయని గ్రహించలేరు.ఎత్తుకుంటే ఆడిస్తారనుకుంటారు కాని కఠోరవిషంతో జీవితాన్ని కాలరాస్తారని పాపం పసిదానికేం తెలుసు.మొన్న వరంగల్ లో జరిగిన సంఘటన మరవకముందే అలాంటి మరో సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.ఈ ఉదంతాన్ని  పూర్తిగా పరిశీలిస్తే ఉత్తర్‌ప్రదేశ్‌లో కామాంధులు విపరీతంగా రెచ్చిపోతూ,వరుస దాడులు, అత్యాచారాలతో మహిళలకు వణుకు పుట్టిస్తున్నారు.చిన్నారులను సైతం వదలకుండా తమ కామవాంఛ తీర్చు కుంటున్నారు.తాజాగా గురుగ్రామ్‌ సమీపంలోని బాద్‌షాపూర్ ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు ఆమెను నీళ్ల ట్యాంకులోపడేసి ఏమి తెలియనట్లు వెళ్లిపోయాడు..  




కాసేపటి తర్వాత అక్కడే పనిచేస్తున్న బాలిక తల్లి  చిన్నారికోసం వెతకగా ఆ పాప కనిపించలేదు. దీంతో కంగారుపడి సమీపంలో ఆడుకుంటున్న పిల్లలను అడగగా ఓ అంకుల్ బాలికను తీసుకుని సెల్లార్‌లోకి వెళ్లినట్లు చెప్పారు.దీంతో ఇతర కూలీల సాయంతో ఆమె గాలించగా చిన్నారి ట్యాంకులో అపస్మారక స్దితిలో కనిపించింది.దీంతో కూలీలు వెంటనే ఆమెను బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.పాపను పరీక్షించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు అంతేకాకుండా కొన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తే ఆమె ప్రాణాలు దక్కేవి కావని కూడ చెప్పారట.ప్రస్తుతం చిన్నారిని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదుసి కోర్టులో హజరుపరచగా న్యాయస్దానం అతనికి 14రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: