బీజేపీ పార్టీ స్వతహాగా మతం పునాదుల మీద పుట్టిన పార్టీ . ఆపార్టీ ఐడియాలజీ మతాన్ని అడ్డు పెట్టుకొని జనాలను రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు సంపాదించుకోవాలని .. అయితే ఇప్పటికే సౌత్ మీద కన్నేసిన బీజేపీ ఎలాగైనా ఏపీలో బలపడాలని అనుకుంటుంది. ఇప్పటికే టీడీపీ నుంచి చోటా మోటా నాయకులూ చేరే సరికే ఏదేదో మాట్లాడుతుంది. అయితే మిగతా రాష్ట్రాల్లో ఎలాగైతే మతాన్ని అడ్డుపెట్టుకొని ఎదిగిందో ఇప్పుడు కూడా ఏపీలో అటువంటి నీచమైన మత రాజకీయాలు చేస్తుంది. జగన్ మీద యాంటీ హిందూ అనే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే జగన్ గురించి అసత్య ప్రచారం చేస్తూ .. విషం కక్కుతోంది. విదేశీ పర్యటనలో ఉన్న జగన్ హారతిని వెలిగించడానికి రాలేదని తప్పుడు ప్రచారం చేస్తుంది. 


అయినా ఇటువంటి మత రాజకీయాలు వేరే రాష్ట్రాల్లో  చెల్లుతాయి గాని ఎక్కువ మంది విద్యా వంతులు ఉన్న ఏపీలో కాదని బీజేపీ నాయకులూ గమనించాలి. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు ఇంకా అసహ్యంచుకుంటారని బీజేపీ నాయకులూ గుర్తించాలి. ఎలాగైనా ఏపీలో టీడీపీకి ప్రహత్యామ్నయంగా ఎదగాలని కాంక్షతో హిందూ కార్డు ను ప్రయోగిస్తోంది. ముందు .. ముందు బీజేపీ ఇలాంటి ట్రిక్ నే ప్లే చేయబోతోందని క్లియర్ గా అర్ధం అవుతుంది. 


 ఏపీలో కనీసం ఒక్క శాతం కూడా ఓట్ల షేర్ లేని బీజేపీ కూడా రాష్ట్రంలో ఎదో జరిగిపోయినట్లు .. పాపం అర్ధం పర్ధం లేకుండా విమర్శలు చేస్తుంది. టీడీపీ స్థానంలో ఎలాగైనా బీజేపీ రావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. ఆ తొందరలో బీజేపీ 6 నెలలు వేచి చూస్తామని చెప్పి చివరికి విషం కక్కే  విమర్శలు షురూ చేసింది. ఇక్కడ కూడా హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని జగన్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని క్లియర్ గా అర్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: