వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తిట్టించడానికి క్యారెక్టర్ ఆర్టిస్టులను వరద బాధితులుగా యాక్షన్ చేయించి తిట్టిస్తారా అంటూ విరుచుకు పడ్డాడు విజయసాయి రెడ్డి.          


విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ 'ఛీ..ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబు గారూ. జూనియర్ ఆర్టిస్టులను వరద బాధితులుగా యాక్షన్ చేయించి ప్రభుత్వాన్ని తిట్టిస్తారా? యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కులం, వృత్తిని ధూషించి యావజ్జాతిని అవమానిస్తారా?' అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ కి స్పందించిన నెటిజన్లు స్పందిస్తూ చంద్రబాబుని, నారా లోకేష్ ని బూతులు తిట్టారు.ఈ ట్విట్ కి కొందరు స్పందిస్తూ 'ఈ టీడీపీ కుల దురహంకారానికి ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎడమ కాలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పారు. టీడీపీ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదు. వారి నాయకుడికి మాత్రం ఇంకా ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదంట. చంద్రబాబు నాయుడు కళ్ళు, చెవులు పని చేస్తున్నయా?' అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి కులాన్ని తిట్టడం సరికాదు అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: