దొందు దొందే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఎవరికి వారే సాటి అని భారతీయ జనతా పార్టీ నేత శ్రీ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తప్పులు చేయడం లో ఇద్దరిదీ దారులు వేరైనా పంధా ఒక్కటే అని శ్రీ కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. తప్పులెన్నువారు తమతప్పులెరుగరు అన్న చందంగా ఇద్దరూ ఒకరిని ఒకరు దూషించు కోవడం తప్ప రాష్ట్రానికి ఉపయోగపడింది ఏమి లేదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బాటనే ఎంచుకుని రాష్ట్రానికి ఉపయోగపడటం లేదని శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నీ వైఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన విధానం సరికాదని, ఆ విషయం తాము చాలా రోజుల నుంచి చెబుతున్న వినకుండా తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇది ఎంత మాత్రము సరికాదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
పోలవరం విషయంలో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బేఖాతరు చేసి ముందుకు పోతున్నారని కనీసం పోలవరం అధారిటీ నీ కూడా ఎంత మాత్రము పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తో కలిసి పనిచేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు.