తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో పాటు, కేటీఆర్‌, కవిత తదితర ప్రముఖులకు మంగళవారం నాడు ఓ అజ్ఞాతవ్యక్తి మురుగునీరు పార్సిళ్లు పంపాడు. గత రెండు రోజులుగా ఈ విషయం చర్చనీయాంశం కాగా.. గురువారం ఆ మురుగునీటి పార్సిళ్లు పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అతడిని సికింద్రాబాద్‌ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వెంటనే నిందితుడ్ని అదుపులోకి తీసుకొన్న వారు విచారణ జరుపుతున్నామని తెలిపారు. అయితే..


తమ ప్రాంతంలో తాగునీరు ఇలా కలుషితంగా వస్తుందని.. దీనిని ప్రభుత్వం దృష్టిగా తీసుకొచ్చేందుకే అతడు ఈ విధంగా చేసినట్లు  అనుమానిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.మంగళవారం సికింద్రాబాద్ హెడ్ పోస్టాఫీసులో వీటిని చూసిన అధికారులు షాక్ అయ్యారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. ‘సికింద్రాబాద్‌ పోస్టాఫీస్ కి ఒకే తరహాలో 60 బాక్సులు వచ్చాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిని డెలివరీ చేయాల్సిన అడ్రస్ లను చూసి పోస్టాఫీస్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ పార్సిళ్లపై..



గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌, కేటీఆర్, కవిత, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.అంజనీకుమార్‌, ఐదుగురు డీసీపీలు… ఇలా అంతా ప్రముఖుల పేర్లే ఉన్నాయి. పార్సిళ్లు చేసిన వ్యక్తి తెలివిగా అతని అడ్రస్ రాయలేదు. బాక్సుల్ని ఓపెన్ చేసి చూస్తే సీసాలు కనిపించాయి. వాటిల్లో రసాయనాల మాదిరి ద్రవం ఉంది. ఒక్కోసీసా లీటరున్నర దాకా ఉంటుంది.


రసాయన బాంబులేమోనన్న అనుమానంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. రంగంలోకి దిగిన పోలీస్‌ టీమ్ సీసాలను పరిశీలించింది. ఇందులో ఏవైనా విష పదార్థాలు, పేలుడు పదార్థాలున్నాయా అని నిర్ధారించుకునేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపించారు. అందులో ఉన్నవి రసాయనాలు కాదని.. మురుగు నీరు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నాం’ అని అధికారులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: