చంద్రబాబు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ చూపించడం బాబుగారికి అలవాటు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా బాబు గారి ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా అర్ధం అయిపోయేది. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రతి పక్షంలో కూర్చోవటంతో అది కూడా జగన్ లాంటి తక్కువ వయసు ఉన్న నేత ముందు ఇక ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 'పిచ్చా? రాష్ట్రానికి శని పట్టిందా? ఎందుకు ఈ మూర్ఖపు నిర్ణయాలు..' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో చంద్రబాబుకు ఎక్కడ లేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని జగన్ ఫిక్స్ అవ్వటంతో పోలవరం పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలవరంకు సంభందించి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే జగన్ ఈ  నిర్ణయం తీసుకోవటానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పోలవరం పనుల్లో వేగమనేది లేకుండా పోయింది. ఎక్కడి పనులు అక్కడే నత్తనడకగా సాగినాయి. దీనిని గమనించిన జగన్ కాంటాక్ట్ ను రద్దు చేసి కొత్తగా వచ్చే కంపెనీ మీద ఒత్తిడి పెట్టి పనులను చక చక పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. 


అయితే పోలవరం కాంట్రాక్టు పనులు చేస్తున్న నవయుగ కంపెనీకి టెర్మినేషన్ లెటర్ ఇచ్చి కాంట్రాక్టు పనులను రద్ధు చేసిన సంగతీ తెలిసిందే. అయితే నవయుగ కంపెనీ ఇప్పుడు కోర్ట్ కు వెళ్ళింది. నవయుగ కంపెనీ అవినీతికి పాల్పడినట్టు ..  ప్రభుత్వం నిరూపించాలి. లేదా పోలవరం పనుల్లో  నాణ్యత లోపించిందని ప్రభుత్వం తేల్చాలి. ఆలా చేయని పక్షంలో కోర్ట్ లో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని కొంత మంది విశ్లేషించారు. అయితే ఇప్పుడు దానికి తగ్గట్టుగానే కోర్ట్ తీర్పు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: