తెలంగాణలో బలపడేందుకు బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించే పనిలో పడింది. ఇప్పటికే వివేక్ లాంటి నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. కొంత మంది నేతలు క్యూ లైన్ లో ఉన్నారు. ఈ చేరికల పై కాంగ్రెస్ లో కొంత అలజడి మొదలైంది. ఆధికార పార్టీ టిఆర్ ఎస్ లో కూడా ఈ వలసలపై డిస్కషన్ నడుస్తుంది. అయితే బీజేపీలోకి జంప్ లను లైట్ గా తీసుకోవాలని గులాబీ బాస్ చెప్పారట. కమలంలోకి వలసల వల్ల జరిగే పరిణామాలపై ఓ కొత్త థియరీ వినిపించింది. బీజేపీలో చేరికల పై ఆందోళన చెందుతున్న టీఆర్ ఎస్ నేతలకు అధినేత చెప్పిన థీరితో కూల్ అయ్యారట.
బీజేపీలో చేరికలు మన మంచికే అని ఆయన చెప్పినట్లు సమాచారం. కాషాయదళంలోకి వెళ్తున్న నేతలంతా కాంగ్రెస్ వారే వారంతా వెళ్లడం వల్ల రెండు లాభాలుంటాయని కేసీఆర్ వివరిస్తున్నాడట. కాంగ్రెస్ నేతలంతా బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీ పూర్తిగా నీరుగారిపోతుంది. బీజేపీలో గ్రూపులు పెరుగుతాయి. ఆ పార్టీలో ఇమడలేని నేతలు తిరిగి మళ్లీ బయటకొస్తారు. దీనివల్ల ఆ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇలా రెండు రకాల లాభాలు జరుగుతాయని ముఖ్యమంత్రి కీలక నేతలకు చెప్పారని తెలుస్తుంది. భవిష్యత్తులో తాను చెప్పే పరిణామాలు జరుగుతాయని మీరూ చూస్తారంటూ మంత్రుల్లో టీఆర్ ఎస్ నేతలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. గతంలో నాగం జనార్థన్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడర్స్ బిజెపిలో చేరారు.
కానీ ఏం జరిగింది ఆ పార్టీలో ఇమడలేక బయటకొచ్చిన సంగతి కేసీఆర్ గుర్తు చేశారట. బీజేపీలో చేరికలో ఆ పార్టీకి కూడా నష్టం చేస్తాయని అన్నారట. సిద్ధాంతం భావజాలం మీద నడిచే పార్టీలో ఇష్టమొచ్చినట్లు జరుగుతున్న చేరికలు ఆ పార్టీకి తీవ్ర నష్టం చేస్తాయి. భవిష్యత్తులో ఈ పరిణామాలు మీరే చూస్తారని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నారట. ఏదేమైనా తెలంగాణలో టీఆర్ ఎస్ తిరుగులేని శక్తిగా ఉంటుంది. దీనిలో పెద్ద డౌట్ లేదని నేతలకూ భరోసాగా కేసీఆర్ చెప్పారట. మొత్తానికి కేసిఆర్ థియరీతో బీజేపీలో చేరికల పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గులాబీ నేతలు సైలెంట్ అయ్యారు.