అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండని ఎంత మొత్తుకున్న వినటం లేదు.జరగ వలసిన ఘోరాలు జరుగుతునే వున్నాయి,చేయవలసిన వారు చేస్తునే వున్నారు.చెప్పవలసిన వారు చెబుతూనే వున్నారు.చదువుకున్నవారు,చదువులేనివారు అనే తేడాలేకుండా పోయింది ఇప్పుడున్న వ్యవస్దలో.ఆత్మ రక్షణ కోసం ఎన్ని మార్గాలను బోధిస్తున్నారో పోలీసులు,సోషల్ మీడియావారు.ఇవన్ని గాలి వార్తల్లా మారిపోయాయి అనిపిస్తుంది ఎవరికైన ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే.రోజుకో అత్యాచారం కేసు వెలుగులోకివస్తుంది,మరి వెలుగులోకి రాని వాటి సంగతేంటంటే సమాధానం వుండదు.ఇప్పుడు మరో రేప్ సంఘటన జరిగింది,ఆమె చదువుకోని అమ్మాయి కాదు బిటెక్ చదువుతున్న స్టూడెంట్ వివరాల్లోకి వెళ్ళితే.



చిత్తురూ జిల్లాలో కురబాలకోట దగ్గర వున్న,అంగళ్ళు అనే గ్రామానికి చెందిన విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు కామాంధులు కలిసి అత్యాచారానికి పాల్ప‌డ‌డం మండలంలో కలకలం రేపింది.కురబాలకోట రూరల్ సీఐ అశోక్ కుమార్ కథనం మేరకు అమ్మాయి,దొమ్మన్నబావి దగ్గర గల కనికిలిబావి దగ్గరికి ఈనెల 3వ తేది సాయంత్రం తన స్నేహితుడితో కలిసి వెళ్లడం చూసిన ఆ వూరి కుర్రాళు పథకం ప్రకారం ఆప్రదేశంలో ఎవ్వరు లేని సమయం చూసి,వారు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ముగ్గురు కలిసి ఆ అబ్బాయిని భయపెట్టి తరిమేసి,ఆ అమ్మాయిని బెదిరించి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు  క్రూరంగా ఆగకుండా ఆంబోతుల్లా అత్యాచారం చేసారట,



అక్కడితో ఆగకుండా అత్యాచారం చేస్తున్నప్పుడు వీడియోలు తీసి ఎవరికైనా చెబితే ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని,మీ తల్లిదండ్రిని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు.ఆ రోజునుండి మానసిక వేదనతో కుమిలిపోతూ పిచ్చిదానిలా తయారైన కూతుర్ని గమనించిన తల్లి గట్టిగా అడ‌గ‌టంతో భయపడుతూ జరిగింది చెప్పడంతో వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందట,స్టేషన్‌లో ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి అదేరోజు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: