చంద్రబాబు ఎన్నికల్లో మళ్ళీ గెలిచి ఉంటే ఎంతో ఉత్సాహంగా సీఎంగా భాద్యతలు చేపట్టి ఉండే వారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రతి పక్షంలో ఉన్నారు. పైగా తన ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం పై టీడీపీలో విపరీతంగా చర్చ నడుస్తుంది. టీడీపీ ఓటమిని ఇంకా చంద్రబాబు ఆ పార్టీ నేతలు జీర్ణించుకునే దశలో ఉన్నట్టు లేదు. ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు.


దీనితో ఆ పార్టీ ఎప్పుడు చూడలేనంతగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 40 ఏళ్ల యువకుడైన జగన్ ..  రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టి 40 ఏళ్ల ఇండస్ట్రీని పాతాళకంలోకి తొక్కేశారు. చంద్రబాబు చివర్లో ఎన్నో  సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టినా ప్రజలు వాటిని విశ్వసించలేదు. దీనితో బాబుకు మరో సారి ప్రతి పక్షంలో కూర్చోక తప్పలేదు. అయితే జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, జగన్ సాధించిన భారీ మెజారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్ అంధకారంలోకి పోయినట్టేనని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.



ఇప్పటికే టీడీపీ పార్టీ నుంచి పెద్ద పెద్ద తలకాయలు బీజేపీలోకి జంప్ అయ్యారు. కొంత మంది అయితే అసలు బయటికి కనిపించడం మానేశారు. అయితే టీడీపీ నుంచి నాయకులూ బీజేపీలోకి చేరడానికి కారణం ఇప్పుడు చంద్రబాబు ఆరోగ్యం కూడా ఒక కారణమని తెలుస్తుంది. చంద్రబాబు మునుపటి మాదిరిగా రాజకీయాలు చేయలేరని తన ఆరోగ్యం సహకరించడం లేదని టీడీపీ నేతలు నుంచే వినిపిస్తున్న మాటలు. దీనితో టీడీపీలోని నాయకులూ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇంకొక పక్క జగన్ పరిపాలనలో టీడీపీ కోలుకోవటం కష్టమేనని కొంత మంది ఫిక్స్ అయ్యారంటా !

మరింత సమాచారం తెలుసుకోండి: