ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు నిన్న రాత్రి 10 :30 నిమిషాల సమయంలో తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యుల ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఇటీవలే కాలంలో ఆయనపై పలు అనేక ఆరోపణలు వెలువెత్తిన సంగతి తెలిసిందే.                                              


ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల శివ ప్రసాద్, అతని కూతురు, కొడుకు హోదా చూపించి చేసిన మోసాలు అన్ని ఒకొకటిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోజుకో మోసం వెలుగులోకి అచ్చి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు కోడెల శివ ప్రసాద్ రావు. ఈ నేపథ్యంలోనే అతని తీరుపై అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.                        


అయితే అన్ని విమర్శలకు కారణం శివ ప్రసాద్ అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు అధికారం ఉందని ప్రజలను మోసం చేసి, అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నిచర్ ని తన వద్దకు చేర్చుకొని రోజుకో అక్రమం చొప్పున 5 ఏళ్ళు ప్రజలను ఇబ్బందులు పెడుతూ కలం గడుపుతూ వచ్చాడు.                                                                                                                             


సరిగ్గా అదే సమయంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఒక్కో అక్రమం వెలుగులోకి వచ్చింది. దీంతో రోజు అయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు గౌతమ్ షోరూమ్ దగ్గర పెద్ద సీన్ క్రియేట్ అయ్యింది. ఇలా రోజురోజుకు ఓ కొత్త సీన్ క్రియేట్ అవ్వడంతో తీవ్ర మస్తాపానికి గురై గుండెపోటు తెచ్చుకున్నారు కోడెల శివ ప్రసాద్ రావు. 


మరింత సమాచారం తెలుసుకోండి: