ఇండియాపై పాకిస్తాన్ ఎప్పుడైతే బురద జల్లడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఇటీవల కాలంలో అంటే.. ఆర్టికల్ 370 ని వ్యతిరేకిస్తూ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకున్న తరువాత ఈ పరిస్థితి మరింత దారుణంగా పడిపోయింది. అంతర్జాతీయంగా ఇండియాను దోషిగా నిలబెట్టాలని చూస్తున్న పాకిస్తాన్ ను ప్రతిసారి ఎదురుదెబ్బ తగులుతూనే ఉన్నది.
ఇప్పుడు ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. అటు ఆర్ధికంగా చితికిపోయింది. ఇప్పుడు అక్కడ డాలర్ తో పాక్ రూపాయి విలువ పతనం అవుతూ వస్తున్నది. ఇప్పుడు ఒక డాలర్ అంటే 162 రూపాయలుగా మారిపోయింది. ద్రవోల్బణం పరిస్థితి కూడా దారుణంగా ఉన్నది. ఇప్పటి వరకు ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి ఉగ్రవాదుల నిరోధం కోసం నిధులు వస్తుండేవి. ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయడానికి ఈ సంస్థతో పాటు అటు అమెరికా వంటి దేశాల నుంచి భారీగా నిధులు వచ్చేవి.
కానీ, గత కొంతకాలంగా ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకోకపోగా .. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ.. ఇండియా వంటి దేశాలపై వారిని ఉసిగొల్పేందుకు సిద్ధపడుతున్న తరుణంలో.. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ నుంచి నిధులు చాలా వరకు ఆగిపోయాయి. దీంతో పాకిస్తాన్ ఆర్ధికంగా చితికిపోయి అవకాశం ఉన్నది. అటు అమెరికా కూడా కోతపెడుతూ వస్తున్నది. ఉగ్రవాద నిర్మూనల కోసం పాకిస్తాన్ కు 40 అంశాలతో కూడిన నియమావళిని తయారు చేసి ఇచ్చింది.
ఆ నియమావళిలో ఉన్న అంశాల ప్రకారం పాకిస్తాన్ ఇచ్చిన నివేదికలోని 32 అంశలపై ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థలోని సభ్యదేశాలు సంతృతప్తి చెందక పోవడంతో ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు సిద్ధం అయ్యింది. అక్టోబర్ వరకు పాకిస్తాన్ కు గడువు ఇచ్చింది. ఇప్పటికే గ్రే లిస్ట్ లో ఉన్న పాక్, అక్టోబర్ లోగా సంతృప్తి కరమైన నివేదికను అందించకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాల్సి వస్తుంది. ఫలితంగా అమెరికా నుంచే కాకుండా ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇతర దేశాల నుంచి అందే ఆర్ధిక సాహయం ఆగిపోతుంది. ఫలితంగా ఉత్తర కొరియా ఎదుర్కొంటున్న సమస్యలను పాకిస్తాన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.