దేశంలో రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. అత్యాచారం చేస్తున్న నిందితుల కోసం కొత్త కొత్త చట్టాలు వస్తున్నా, నిందితులను కఠినంగా శిక్షిస్తున్నా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగటం లేదు. తాజాగా ఇలాంటి సంఘటన విశాఖపట్టణం జిల్లాలోని అరకులోయ ప్రాంతంలో చోటుచేసుకుంది. అరకు ప్రాంతంలోని శరభలోయ సమీపంలో యువతిపై దారుణంగా అత్యాచారం చేయటంతో పాటు హత్య చేసాడు దుండగుడు. బండరాయితో బలంగా కొట్టి దుండగుడు యువతిని హత్య చేసాడని తెలుస్తుంది. ఈ యువతి పేరు కిల్లో పుష్ప అని తెలుస్తుంది. అత్యాచారం చేసిన తరువాత దారుణంగా హత్య చేసి రోడ్డు పక్కన పడేశాడు నిందితుడు. అరకు మండలం శరభగూడ సీఏహెచ్ పాఠశాల సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుని పేరు మహేశ్ అని సమాచారం. మహేశ్ కు ఇప్పటికే వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. ఇప్పటికే వివాహం అయినప్పటికీ పుష్పను గత కొంత కాలంనుండి పెళ్ళి చేసుకుంటానని వేధించటం మొదలుపెట్టాడు. పుష్ప ఇష్టం లేదని ఎంత చెబుతున్నప్పటికీ మహేశ్ నుండి వేధింపులు ఆగలేదని తెలుస్తుంది.పుష్ప స్థానికంగా ఒక మీసేవా సెంటర్లో పని చేస్తోంది. మీ సేవా సెంటర్లో పని చేయటం వలన నిందితునికి పుష్ప పరిచయం అయిందని సమాచారం. 
 
నిన్న రాత్రి సమయంలో పుష్పను మాట్లాడాలని పిలిచి అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీస్ విచారణలో తెలిసింది.నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.చట్టాల మీద నమ్మకం లేదని విడిచిపెడితే మేమే చూసుకుంటామని బంధువులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. యువతి హత్యతో ఈ ప్రాంతమంతా విషాద ఛాయలు ఏర్పడ్డాయి. ఈమె గిరిజన యువతి అని సమాచారం. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: