ఏపీ మాజీ సీఎం ప్రస్తుతం ఏపీ ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతా అని ఎన్నికల ముందు బాబు గారు చేసిన హడావిడి ఎంత చెప్పినా తక్కువే. బీజేపీ వ్యతిరేక కూటమిని ఒక దిక్క చేర్చడానికి బాబు గారు బాగానే కష్టపడ్డారు. ఎట్టి పరిస్థితిలో బీజేపీ అధికారంలోకి రాకూడదని ఢిల్లీకి .. బెంగాల్ కు చాలా సార్లు తిరిగారు. ప్రధాన మంత్రిని నిర్ణయించేది మేమె అని టీడీపీ ఎన్ని గాంభీర్య మాటలు చెప్పిందో మనం చూశాము. అయితే ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అయ్యింది. కేంద్రంలో బీజేపీ అఖండ మెజారిటీతో గెలిచింది. ఏపీలో బాబు గారు సైకిల్ చక్రం .. ఫ్యాను గాలిలో కొట్టుకు పోయింది. దీనితో బాబు గారి జాతీయ చక్రం కూడా కూలిపోయింది.


ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు. దీనితో ఆ పార్టీ ఎప్పుడు చూడలేనంతగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.


40 ఏళ్ల యువకుడైన జగన్ ..  రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టి 40 ఏళ్ల ఇండస్ట్రీని పాతాళకంలోకి తొక్కేశారు. చంద్రబాబు చివర్లో ఎన్నో  సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టినా ప్రజలు వాటిని విశ్వసించలేదు. దీనితో బాబుకు మరో సారి ప్రతి పక్షంలో కూర్చోక తప్పలేదు. అయితే జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, జగన్ సాధించిన భారీ మెజారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్ అంధకారంలోకి పోయినట్టేనని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: