మోదీ స్మార్ట్ పోలీస్ మంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని కొత్త ఐపిఎస్ అధికారుల కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సూచించారు.
హైదరాబాదు లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్స్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.  ఈ వేడుకలో హోం మంత్రి ప్రొబేషనర్స్  కవాతును పరిశీలించి, ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రొబెషనర్లకు బహుమతి ప్రదానం చేశారు, మొత్తం 103 మంది అధికారులలో 15 మంది మహిళా అధికారులు, 6 గురు రాయల్ భూటాన్ పోలీసులు మరియు 5 గురు నేపాల్ పోలీస్ సర్వీస్ అధికారులు ఉన్నారు. ప్రొబెషనరీ అధికారులందరినీ, ముఖ్యంగా మహిళా అధికారులను షా అభినందించారు. యువ అధికారులు అత్యంత అంకిత భావంతో దేశానికి సేవ చేయడం ద్వారా భారతీయ పోలీసు సేవ యొక్క విశిష్ట సంప్రదాయంలో భాగస్వాములవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్య సాధనకు ఐపిఎస్ లో చేరడంతో పూర్తి కాలేదని,  భవిష్యత్తులో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలని చెప్పారు.



హైదరాబాద్‌ సంస్థానంను భారత్‌ లోకి విలీనం చేసేందుకు తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు అమిత్ షా. భారత్‌ లోకి ఎన్నో సంస్థానాలను విలీనం చేసేందుకు పటేల్ కష్టపడ్డారని చెప్పారు. ఎప్పటి నుంచో సమస్యగా మారిన జమ్ము,  కశ్మీర్‌ కు  నరేంద్ర మోదీ సర్కార్ విముక్తి కల్పించిందని అమిత్ షా గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసి అక్కడి అభివృద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని చెప్పారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌ లో విలీనం కోసం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని తెలిపారు. స్వదేశీ సంస్థానాల విలీనం కోసం పటేల్ చేసిన కృషి ఎప్పటికీ మరచిపోలేనిదన్న అమిత్ షా.. పోలీస్ సేవలు ఎక్కడ ఉంటే అక్కడ సర్ధార్ పటేల్ ఉంటారన్నారు. సర్దార్ పటేల్ సివిల్ సర్వీసుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారనీ, వారు సమాజంలోని పేదవారి అభ్యున్నతికి పాటుపడాలని అభిలషించేవారని షా పేర్కొన్నారు. ఐపిఎస్‌ సాధించడంతోనే ఆశయం నెరవేరినట్లు కాదని, నిజాయితీగా పని చేసి దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 




ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ ఆశయం నెరవేరిందన్నారు.  దేశ రక్షణ కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణాలు ఇచ్చారని, వారి త్యాగాలను మరచిపోరాదని  షా అన్నారు.  రాజకీయ నాయకులు కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారని, అదే పోలీసులు దాదాపు 30 ఏళ్ల పాటు సర్వీసులో ఉంటారని శ్రీ అమిత్ షా అన్నారు.  ఐపిఎస్ అధికారులు నిజాయితీతో పని చేసి దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఇక పేదరికంలో మగ్గుతున్న ప్రజలకు సేవచేసి, వారిని వృద్ధిలోకి తీసుకురావాలన్నారు.  పేద ప్రజల తరపున నిలిచి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. మనసు చెప్పినట్లుగా నడుచుకోవాలని చెప్పిన అమిత్ షా, ఎక్కడైనా కానీ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా వ్యవహరించాలని చెప్పారు. పేదరికంలో మగ్గుతున్న కోట్లాది ప్రజలకు సేవ చేసి వారిని వృద్ధిలోకి తీసుకురావాలన్నారు. భారతమాత కోసం ఇప్పటికే ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ మంచి పలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీలు పాల్గొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: