సీబీఐ , ఈడీ దర్యాప్తు సంస్థలు ఇప్పుడు కేంద్రం చేతిలో ఉన్న పంజరాలు మాదిరిగా తయారైనాయి. ఒక సందర్భములో సుప్రీం కోర్ట్ కూడా సీబీఐ పంజరంలో చిలకల మాదిరిగా కాకుండా స్వతంత్ర కావాలని వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు చిదంబరం .. అమిత్ షా ఎపిసోడ్ చూస్తుంటే రాజకీయ ప్రతికారంలో దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని అర్ధం అవుతుంది. రాజకీయ నేతలు అధికారంలోకి రాగానే .. ప్రత్యర్థుల పైన పగ తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగించి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతారు. శాశ్వతంగా తామే అధికారంలో ఉంటామని భ్రమలో బతుకుంటారు. ఇప్పుడు చిదంబరంను చూస్తుంటే అలానే అనిపిస్తుంది.


కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ, ఈడీ తన గుప్పిట్లో పెట్టుకొని అందరి మీద కక్ష తీర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ దర్యాప్తు సంస్థలే చిదంబరంను తీహార్ జైలుకు తరలిస్తున్నారు. ఈ సూత్రం ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే కాదు. ఇప్పుడు బీజేపీకి కూడా వర్తిస్తుంది. ఈ రోజు బీజేపీ అధికారంలో ఉండొచ్చు .. రేపు కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు. కానీ ఎందుకు రాజకీయ నేతలు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారని అర్ధం కావటం లేదు. 


అయితే చిదంబరం పట్ల ఎవరు పెద్దగా సానుభూతి చూపించడం లేదు. ఎందుకంటే అధిరికంలో ఉన్నప్పుడు గర్వంతో ప్రత్యర్థులను ఇలానే జైలుకు పంపించారు. అప్పట్లో ఏపీ సీఎం జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టించడంలో చిదంబరంకీలక పాత్ర పోషించాడని ఒక టాక్ కూడా ఉంది. సోనియా గాంధీని ఎదిరించినందుకు రాజకీయంగా జగన్ మీద కక్ష తీర్చుకున్నారు. అయితే ఇప్పుడు అదే చిదంబరంకు ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినే రోజు వచ్చింది.  అప్పట్లో అమిత్ షా ను జైలు పాలు చేసిన చిదంబరం .. ఇప్పుడు అమిత్ షా అధికారంలో ఉండటంతో కసి తీర్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: