సోషల్ మీడియా అన్నది పదునైన ఆయుధం. దాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేయకూడదో అదే చేస్తున్నారు. ఎదుటి వ్యక్తుల క్యారక్టర్ ని దారుణంగా దెబ్బ తీయడానికి వాడుకుంటున్నారు. ఇక ఉన్నవి లేనివీ ప్రచారం చేస్తూ అయోమయాన్ని, అనుమానాలను పెంచుతున్నారు.  అన్నిటికంటే దారుణం ఏంటంటే కులం మతం పేరిట దూషణ పర్వం.


ఈ విధంగా  ముఖ్యమంత్రి జగన్ మీద, ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద కుల దూషణతో పాటు, అసభ్యకరమైన భాషను వాడుతూ పరువు తీస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఏపీ పోలీసులు. పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని విచారించగా దారుణమైన విషయాలు బయటపడ్డాయిట. ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇది అతి పెద్ద రాకెట్ గా సాగుతోంది, ఎన్నో బ్రుందాలు పని చేస్తున్నాయని కూడా శేఖర్ చౌదరి చెప్పుకొచ్చాడు.



ఇలా పని చేస్తున్న బ్రుందాల పని ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం, లేని విషయాలు జనంలోకి పంపించి అభాసుపాలు చేయడం. ఇక వైసీపీ సర్కార్ ముఖ్యుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి వారిని దారుణంగా అవమానించం ఇలా చాలా చేస్తాయట ఈ బ్రుందాలు. ఈ బ్రుందాలకు సినీ ప్రముఖులు డైరెక్షన్ ఇస్తున్నారని కూడా కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా శేఖర్ చౌదరి బయటపెట్టాడట. ఇక ఈ మొత్తం రాకెట్లో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారని చౌదరి వారి పెర్లను సైతం పోలీసులకు అందించారట.



చూడబోతే జగన్ని తిన్నగా పాలన చేసుకోనీయకుండా బురద జల్లే బ్రుందాలు గట్టిగా పనిచేస్తున్నాయని అనుకోవాలి. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి తెర వెనక పెద్ద తలకాయలను బయటకు తీయకపోతే ఇది మరింతగా రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి వైసీపీ సర్కార్ ని, జగన్ని అప్రతిష్టపాలు చేస్తే ఎవరికి రాజకీయ ప్రయోజనమో లాజికల్ గా అలోచిస్తే ఇందులో బడా గ్యాంగ్ ఇన్వాల్మెంట్ ఉందని అర్ధమవుతోంది. చూడాలి మరి ఈ దర్యాప్తులో ఏ పేర్లు బయటకు వస్తాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: