నేత్ర దానం చేయండి
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నది పెద్దలు చెప్పిన మాట. చూపు యొక్క ముఖ్య పాత్రను, కంటి చూపు ఆవశ్యకతను తెలియజేస్తూ చెప్పిన ఈ మాట అందరికీ తెలిసినదే. అందుకే ప్రతి ఒక్కరూ నేత్ర దానం చేసి తోటి వారికి చూపు ప్రసాదించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావు అన్నారు.
మన మరణాంతరం కూడా జీవించి ఉండడమే కాకుండా ఒక వ్యక్తి కి కంటి చూపు ప్రసాదించి అతని జీవితంలో వెలుగు రేఖలు నింపడం ఓక్క నేత్ర దానం తో మాత్రమే సాధ్యమని శ్రీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. నేత్ర దానం మానవత్వానికి ప్రతీక అని అందు వలన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందం గా ముందుకు వచ్చి నేత్ర దానం చేయాలి అని ఆయన ఉద్భోదించారు.
స్వేచ్ఛ గోరా ఐ నిర్వహిస్తున్న నేత్రదాన ప్రచారం పక్షోత్సవాలు ప్రారంభిస్తూ ద్వారకా తిరుమల రావు పై విధంగా తెలియజేశారు. ఎంతోమంది అందులకు కంటి చూపు ప్రసాదించి వారి జీవితం వెలుగు జిలుగు లు తో నింపే ఈ మహత్కార్యం లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని నేత్ర దానం చేసి ఎంతమంది అందులకు కంటి చూపు ప్రసాదించమని ఆయన సమావేశానికి హాజరైన వారందరికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బ్లైండ్నెస్ అధికారులు, కొంతమంది వైద్యులు కూడా పాల్గొని నేత్ర దానం ఆవశ్యకత కోసం ప్రసంగించారు