వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. గ్రామ సచివాలయం కాన్సెప్టు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఉన్న ఊళ్లోనే అందిస్తున్నారు. అందులో తొలి విడతగా గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చారు. ఏపీలో చాలాచోట్ల గ్రామ వాలంటీర్లు విధులు ప్రారంభించారు. అనేక చోట్ల వీరి పరిచయ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


విజయనగరంలో జరిగిన వాలంటీర్ల సభలో మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకున్నాయి.. గ్రామ వాలంటీర్లు అలా పని చేయకండని అని సూచించారు. తప్పు చేస్తే ఉద్యోగంలోంచి తొలగిస్తాం. బాధ్యతగా పని చేసుకోండని తొలిరోజే హెచ్చరిక జారీ చేశారు. చాలా పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను పేజీలకు పేజీలు నింపారు తప్ప ఎవ్వరూ పాటించలేదు. కానీ వైఎస్‌ జగన్‌ 35 వాగ్ధానాలను ఒక్క పేపర్లో మాత్రమే పొందుపరిచారు. అన్నీ ప్రజలకు అర్ధమయ్యే రీతిలో స్పష్టంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది.


అభివృద్ధి కార్యక్రమాలలో అందర్ని భాగస్వామ్యం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. డబ్బు ప్రధానం కాదు. ఆలోచన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో వాలంటీర్ల నియామకం జరిగింది. వైయస్‌ఆర్‌ సీపీ విడుదల చేసిన మేనిఫెస్టో మనందరికి భగవద్గీత. జిల్లావ్యాప్తంగా 777 సచివాలయాలు పెడుతున్నాం. చదువుకునే వాళ్లకి ఉద్యోగం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు పోతోంది. లక్షా యాభై వేల ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.


నవరత్నాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని వాలంటీర్లను నియమించారు. ప్రభుత్వం అంతా మీ ద్వారానే పథకాలని అమలు చేస్తుంది. గౌరవంగా పని చేసి పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా చూడండి. జన్మభూమి కమిటీల మాదిరిగా పనిచేయకండి. నిర్భయంగా ఎవరు అర్హులో గుర్తించండి. ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో చాలమంది తమ పిల్లలను చదివించుకోలేక పోయారు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రోత్సాహకాలను అందిస్తుంది. ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పండి అంటూ కొత్తగా ఎంపికైనా గ్రామ వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు మంత్రి బొత్స.


మరింత సమాచారం తెలుసుకోండి: