ఆది నారాయణ రెడ్డి టీడీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్ లో జగన్ మీద రెచ్చిపోయేవారు. మిగతా వారు ఆచి తూచి స్పందిస్తే.. ఆది మాత్రం నా లాంటి తోపు లీడర్ కడపలోనే లేడని మీడియా ముందు జగన్ మీద విమర్శలు గుప్పించేవారు. అయితే అనూహ్యంగా టీడీపీ ఘోర ఓటమి .. ఆది నారాయణ రెడ్డి కూడా ఓడిపోవటంతో ఇప్పుడు అయన బయటికి రావటం లేదు. జగన్ తనను ఎక్కడ వేధిస్తాడో అని జగన్ ఫోబియో పట్టుకుందని కొందరు అభిప్రాయం పడుతున్నారు. అయితే వైసీపీ పార్టీ నుంచి చాలా మంది ఫిరాయించిన ..  మనకు ఆది నారాయణ రెడ్డి మాత్రం మనకు గుర్తుకు వస్తారు. ఎందుకంటే జగన్ మీద ఘోరంగా విరుచుకుపడిన నేతల్లో అది నారాయణ రెడ్డి ఒకరు.


చంద్రబాబు మెప్పు కోసం మీడియా ముందుకు వచ్చి జగన్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. చాలా సార్లు తన స్థాయిని దాటి జగన్ ని విమర్శించేవారు. టీడీపీలో మంత్రి పదవిని కూడా దక్కించుకోవటంతో ఓ రేంజ్ లో రెచ్చిపోయేవాడు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని చెప్పాలి. 2019 ఎన్నికల్లో అది నారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక టీడీపీ పార్టీ అయితే నామరూపాలు లేకుండా పోయింది.


ఇక కడపలో అయితే టీడీపీ జెండా ఎగరకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆది నారాయణ రెడ్డి బయటికి కూడా రావటం లేదు. మీడియా ముందుకు కనిపించడం లేదు. టీడీపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. కడపలో తన వ్యాపారాలు తాను చూసుకుంటూ కనిపించకుండా తిరుగుతున్నాడు. అయితే ఆది నారాయణ రెడ్డి బీజేపీలో మారడానికి ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. ఇంకా టీడీపీలోనే ఉంటే వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టదని ఆదికి బాగా తెలిసినట్టుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: