కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో .. రెండు మూడు రోజుల నుంచి దేవెగౌడ .. కుమార స్వామీ ఇద్దరు కూడా సిద్దరామయ్య ను టార్గెట్ చేసిన సంగతీ తెలిసిందే. తమ ప్రభుత్వం పడి పోవటానికి కారణం సిద్దరామయ్యే అని చెప్పుకొచ్చారు. తాజాగా కుమార స్వామీ మాట్లాడుతూ .. నా మొదటి శత్రువు సిద్దరామయ్య అని బీజేపీ కాదని సంచలన వ్యాఖ్యలు చేసినారు. ఇంకామ్ మాట్లాడుతూ సంకీర్ణ ప్రభుత్వంలో తానొక క్లర్క్ మాదిరిగా పనిచేశానని .. చివరికి కలెక్టర్ల బదిలీలు కూడా కాంగ్రెస్ నేతలు చెప్పినట్టే చేయాల్సి వచ్చిందని కుమార స్వామీ వాపోయారు. అయితే ఇది వరకే దేవ గౌడ కూడా మొదటి సారిగా ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్దరామయ్యే అని చెప్పుకొచ్చారు.


ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్దరామయ్యే అని అతని క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెబుతున్నారని దేవెగౌడ చెప్పుకొచ్చారు. సిద్దరామయ్యను సంతృప్తి పరచడం కోసం మా ప్రభుత్వం చాలా చేసిందని కానీ సిద్దరామయ్య సంతృప్తి చెందలేదని ఆయన వాపోయ్యారు. ఇంతక ముందు కూడా కుమార స్వామీ కూడా ఇలానే స్పందించారు. సిద్ద రామయ్యకు మొదటి నుంచి జేడీస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేదని .. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టారని చెప్పుకొచ్చారు. 


అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి కూడా కష్ట కాలం మొదలు కాబోతుంది.  కర్ణాటకలో కాంగ్రెస్ — జేడీస్ ప్రభుత్వం కూలిపోయిన తరువాత బొటా బొటి మెజారిటీ తో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చడానికి కొంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతీ తెలిసిందే. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. కొంత మంది ఎమ్మెల్యేలు ను స్పీకర్ అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే బల పరీక్షలో నెగ్గిన బీజేపీ .. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: