జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే ఏకైక ధ్యేయంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పని చేస్తున్నారు. దేవినేని గాలి మాటలను పట్టుకుని ఎల్లోమీడియా కూడా విస్తృత ప్రచారం చేస్తోంది. ఆ గాలి మాటలనే యాదార్ధాలని జనాలను నమ్మించేందుకు ఎల్లీమీడియా యధాశక్తి ప్రయత్నాలు చేస్తోంది.

 

ఇటువంటి ఓ పనికిమాలిన కథనాన్ని తాజగా అచ్చేసి జనాల్లోకి వదిలేసింది. ఇంతకీ ఈ గాలి కథనం విషయం ఏమిటంటే జగన్ అమెరికాకు వెళ్ళేముందు కడప జిల్లాలోని ఓ వైసిపి నేతను పిలిచి దొనకొండలో భూములు కొనేయమని ఆదేశించారట. మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయారు కాబట్టి సదరు నేతకు లబ్ది చేకూర్చే ఉద్దేశ్యంతో దొనకొండలో భూములు కొనమని చెప్పారని దేవినేని ఆరోపించారని ఎల్లోమీడియా చెప్పింది.

 

నిజానికి దేవినేని చేసిందే ఓ పనికిమాలిన ఆరోపణ. నిజంగానే జగన్ కడప జిల్లాలోని నేతకు ఆ విధంగా చెప్పుంటే దేవినేని ఊరికే గాలి ఆరోపణలు చేసేవారు కాదు. కడప జిల్లాలో ఆ నేత ఎవరో కూడా చెప్పిండేవారే. పైగా తాను జగన్ పై గాలి ఆరోపణలు చేసి నిజమో కాదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.

 

టిడిపి నేతల వ్యవహారం ఎలాగుందంటే గుడ్డకాల్చి ఎదుటివారి మొహంపై వేసేస్తారు. దాని మసి మొహానికి అంటుకోగానే ప్రత్యర్ధులు మొహానికి మసిపూసుకుని తిరుగుతున్నారు అంటూ ప్రచారం చేస్తారు. టిడిపి నేతల బ్లాక్ మెయిలింగ్ కు ఎల్లోమీడియా సంపూర్ణ సహకారం అందిస్తుంటుంది. జగన్ ను గబ్బు పట్టించే కార్యక్రమం టిడిపి+ఎల్లోమీడియా+పెయిడ్ ఆర్టిస్టుల సమన్వయంగా బాగా ఊపందుకుంది. కాకపోతే మొన్న శేఖర్ చౌదరి అనే పెయిడ్డ ఆర్టిస్ట్ పట్టుబడటంతో కొంత గ్యాప్ రావచ్చంతే.

 

ఈ గ్యాప్ లోనే పచ్చనేతలు ఎల్లోమీడియాను వాడుకుంటారు. రాజధాని మారుతుందని జగన్ ఇంత వరకూ చెప్పనేలేదు. పైగా దొనకొండలో రాజధాని ఏర్పాటు చేస్తారని ఎవరూ చెప్పనే లేదు. అలాంటిది రాజధానిని మార్చేస్తారని, దొనకొండలో భూములు కొనమని కడప నేతకు జగన్ ఆదేశించినట్లు ఎల్లోమీడియా ద్వారా టిడిపి ప్రచారం చేసేస్తుండటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: