మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పరువు ఇప్పుడు బజారున పడింది. మరీ ఘోరంగా ఫర్నిచర్ దొంగతనంలో దొరికిపోయేసరికే కుటుంబ పరువు కూడా పోయింది. అయితే అందుతున్న సమాచారం మేరకు కోడెల తరువాత ఎన్నికలో పోటీ చేసేది కష్టమేనని తెలుస్తుంది. కోడెలకు మళ్ళీ టికెట్ ఇచ్చే సాహసం టీడీపీ చేయదు. ఇక ఇప్పటికే కోడెల పరువు ;పోవటంతో మళ్ళీ పోటీ చేసిన గెలవనని తనకు కూడా అర్ధం అయ్యింది. దీనితో కోడెల రాజకీయాల నుంచి తిప్పుకోవచ్చని తెలుస్తుంది. అసీంబ్లీ కోసం తెచ్చిన ప్రభుత్వ ఆస్తిని కోడెల శివప్రసాద్ తన స్వంత ప్రయోజనాల కోసం వాడుతున్నారని అధికారులు నిర్ధారణకు రావటంతో పోలీసులు కోడెల అతని కుమారుడి మీద కేసు నమోదు చేసారు.


సెక్షన్ 409 కింద .. సెక్షన్ 414 కింద కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 414 అంటే ఏదైనా ప్రొపెర్టీని దొంగతనం చేస్తే ఈ సెక్షన్ కేసు నమోదు అవుతుంది. చివరికి మాజీ స్పీకర్ కోడెల ఒక దొంగతనం కింద కేసు బుక్ అయ్యిందంటే కోడెల గురించి జనాలు నోరెళ్లబెడుతున్నారు. .అయితే గతంలో కోడెల చేసిన అరాచకానికి అద్దు అదుపు లేకుండా పోయింది. ఏకంగా కే టాక్స్ అంటూ ప్రజలను హింసించారు. ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు ఎలా ఉండ కూడదో ఒక్క కోడెల శివప్రసాద్ ను చూపిస్తే సరిపోతుంది.


అయితే ఇప్పుడు కోడెల గురించి ఫర్నిచర్ దొంగతనం బయటికి వచ్చిన సంగతీ తెలిసిందే. ఒక ప్రజా ప్రతి నిధి అయి ఉండి అసెంబ్లీ కోసం తెచ్చిన ఫర్నిచర్ ను కూడా దొంగిలించే స్థాయికి కోడెల దిగజారిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. టీడీపీలో ఇంకెన్ని ఘోరాలు జరిగివుంటాయో ..  అయితే ఈ వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా జరిగి ఉండదు. చంద్రబాబుకు తెలిసినా పట్టించుకోలేదంటే .. బాబు గారికి ఇవన్నీ చాలా చిన్న విషయాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: