దేశంలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అయితే చిదంబరం తరపున వాదిస్తున్న కపిల్ సిబాల్ కోర్టులో చాలా గట్టిగానే వాదిస్తున్నారు. ఈ కేసులో చిదంబరం డైరెక్ట్ ప్రమేయం ఉందని మీరు నిరూపిస్తే నేనే కేసును వదిలేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో పక్క చిదంబరం .. సీబీఐ కావాలనే పిచ్చి, పిచ్చి ప్రశ్నలు ఇంట్రాగేషన్ పేరుతో అడుగుతుందని .. నా పేరు ప్రతిష్టలను దెబ్బ తీస్తుందని ఆరోపించారు. అయితే కోర్టులో చిదంబరంకు ఉపశమనం దొరకలేదు. సుప్రీం కోర్ట్ కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనితో మరో 4 రోజులు సీబీఐ కస్టడీలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 


అయితే చిదంబరం అరెస్ట్ పట్ల ఎవరు కూడా జాలి చూపని పరిస్థితి. ఎందుకంటే ఎందుకంటే అధిరికంలో ఉన్నప్పుడు గర్వంతో ప్రత్యర్థులను ఇలానే జైలుకు పంపించారు. అప్పట్లో ఏపీ సీఎం జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టించడంలో చిదంబరంకీలక పాత్ర పోషించాడని ఒక టాక్ కూడా ఉంది. సోనియా గాంధీని ఎదిరించినందుకు రాజకీయంగా జగన్ మీద కక్ష తీర్చుకున్నారు. అయితే ఇప్పుడు అదే చిదంబరంకు ఇప్పుడు జైల్లో చిప్పకూడు తినే రోజు వచ్చింది. చెడపకురా.. చెడేవే అని పెద్దలు ఊరకనే అనలేదు. ఇలాంటి నీచమైన రాజకీయ నేతలు ఉంటారు కాబట్టే ఇటువంటి సామెతలు పుట్టాయి కాబోలు. 


అయితే చిదంబరం 2017 నుంచి తప్పించుకుంటూ ఎన్నో స్టే లు తెప్పించుకున్నారు. చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే. అప్పుడే చిదంబరం .. కొడుకు కు లభ్ది చేకూర్చాలని పక్క దారిలో విదేశాల నుంచి డబ్బులు ఐఎన్ ఎక్స్ మీడియాలోకి వక్రమార్గంలో నిధులు తరలించారు. స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్ అయిన చిదంబరం అన్నీ జాగ్రత్తలు తీసుకోని స్కాం చేశారు. కానీ ఎంత జాగ్రత్తగా తప్పు చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పుడు అలానే చిదంబరం దొరికిపోయారు. ఎట్టకేలకు చిదంబరంను సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: