వైసీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సరిపోయింది గాని అదే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే కోడెల ఫర్నిచర్ భాగోతం బయటికి వచ్చేది కాదని చెప్పొచ్చు. టీడీపీ అధికారంలో మళ్ళీ వచ్చి ఉంటే కోడెల మళ్ళీ స్పీకర్ స్థానంలో చేతివాటం ఇంకా ఎక్కువయ్యేది. కోట్ల విలువ చేసే ఫర్నిచర్ అయన ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటికి వచ్చేది కాదు. కానీ వైసీపీ అధికారంలోకి రావటంతో కథ మొత్తం అడ్డంగా తిరిగింది. కోడెల అడ్డంగా బుక్ అయ్యారు. అతని మీద కేసులు కూడా నమోదు అయ్యాయి.  అసీంబ్లీ కోసం తెచ్చిన ప్రభుత్వ ఆస్తిని కోడెల శివప్రసాద్ తన స్వంత ప్రయోజనాల కోసం వాడుతున్నారని అధికారులు నిర్ధారణకు రావటంతో పోలీసులు కోడెల అతని కుమారుడి మీద కేసు కూడా నమోదు చేసారు.


సెక్షన్ 409 కింద .. సెక్షన్ 414 కింద కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 414 అంటే ఏదైనా ప్రొపెర్టీని దొంగతనం చేస్తే ఈ సెక్షన్ కేసు నమోదు అవుతుంది. చివరికి మాజీ స్పీకర్ కోడెల ఒక దొంగతనం కింద కేసు బుక్ అయ్యిందంటే కోడెల గురించి జనాలు నోరెళ్లబెడుతున్నారు. .అయితే గతంలో కోడెల చేసిన అరాచకానికి అద్దు అదుపు లేకుండా పోయింది. ఏకంగా కే టాక్స్ అంటూ ప్రజలను హింసించారు. ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు ఎలా ఉండ కూడదో ఒక్క కోడెల శివప్రసాద్ ను చూపిస్తే సరిపోతుంది.


అయితే ఇప్పుడు కోడెల గురించి ఫర్నిచర్ దొంగతనం బయటికి వచ్చిన సంగతీ తెలిసిందే. ఒక ప్రజా ప్రతి నిధి అయి ఉండి అసెంబ్లీ కోసం తెచ్చిన ఫర్నిచర్ ను కూడా దొంగిలించే స్థాయికి కోడెల దిగజారిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. టీడీపీలో ఇంకెన్ని ఘోరాలు జరిగివుంటాయో ! అయితే ఇన్ని జరుగుతున్న టీడీపీ పార్టీ నుంచి సపోర్ట్ రావటం లేదు. లోకేష్ గాని చంద్రబాబు గాని కోడెలకు సపోర్ట్ పక్కన పెడితే తప్పు చేస్తే శిక్షించమని చంద్రబాబు చెప్పుకొచ్చారు అంతే గాని కక్ష సాధింపులకు దిగితే సహించేది లేదని చెప్పారు. అంటే బాబు .. కోడెల తప్పు చేశాడని ఒప్పుకున్నట్టే కదా ! అయితే కోడెల పై ఇప్పటికే నియోజక వర్గ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: