వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసే ఆశ వర్కర్ల విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టడంలో అదో రకమైన శాడిస్టు ఆనందాన్ని పొందున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'ఆశా సిస్టర్ల జీతాలను 3 వేల నుంచి సీఎం జగన్ గారు పది వేలకు పెంచినప్పటి నుంచి చంద్రబాబు గారికి నిద్ర పట్టడం లేదు. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, వేధిస్తున్నారని ఊహాజనిత విమర్శలతో శాడిస్ట్ ఆనందం పొందుతున్నారు. ఎల్లో మీడియా కూడా తాళం వేస్తోంది.' అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు చంద్రబాబు నాయుడుపై ఫైర్ అవుతున్నారు. 


ఈ విషయంపై ఓ నెటిజన్ ట్విట్ చేస్తూ ''రోగం సారు ! రోగం ..అది కుదురుగా కుర్చోనిస్తెగా ??? ఏలో గలా వేలు పేట్టి గెలికి యెల్లో మీడియా లో కనిపిస్తూ ప్రచారం పొందుదాం అనే శాడిస్టు ఆలోచన ,పెయిడ్ ఆర్టిస్టులకు కొదవ లేదు. చంద్రబాబు నాయుడుకి రోగం కుదుట పడదు, మనకు ఈ టార్చర్ తప్పదు'' అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన మరికొంతమంది నెటిజన్లు స్పందిస్తూ ''అవును నిజమే .. ఇది ఒకరకమైన సైకో ఆనందం'' అంటూ ట్విట్ చేస్తున్నారు. మరి విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్లకు చంద్రబాబు లెఫ్ట్ హ్యాండ్ బుద్ధా వెంకన్న ఎలా స్పందిస్తారో చూడాలి.   
 



మరింత సమాచారం తెలుసుకోండి: