వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలంతా దొంగలే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల, యరపతినేని వంటి దోపిడీ దొంగలు, ఘరానా దొంగలు వందలమంది ఉన్నారని వ్యాఖ్యానించారు.    


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'కోడెల, యరపతినేని వంటి దోపిడీ దొంగలు టీడీపీలో వందల మంది ఉన్నారు. బీజేపీలోకి జంప్‌ అయిన వారిని వదిలేసినా. ప్రకృతి వనరులు వాళ్ల బాబు గారి సొత్తు అన్నట్టు బెల్లం ముక్కల్లా నమిలేశారు. కలుగులోని పంది కొక్కులంతా చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు.' అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ స్పందించిన నెటిజన్లు కోడెల, యరపతినేనిపై విరుచుకు పడ్డారు.


ఓ నెటిజన్ ట్విట్ చేస్తూ 'కోడెల శివ ప్రసాద్, అతని సుపుత్రుడికి అసలు కొంచం కూడా సిగ్గులేదు, అధికారం చేతిలో ఉంది అని అరాచకాలు చేస్తూ, ఆంధ్ర రాష్ట్రాన్ని, అసెంబ్లీని దోచుకున్నారు. ఇప్పుడు అవి అన్ని బయట పడేసరికి గుండె పోటు అంటూ డ్రామాలు ఆడుతున్నారు, ఇవి అన్ని కాకా బెయిల్ కోసం హై కోర్టుని ఆశ్రయిస్తున్నారు' అని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: