స‌మాజంలో రోజు రోజుకు మాన‌వుల మ‌ధ్య సంబంధాలు మంట క‌లుస్తున్నాయి. ఇవిఎంత దారుణంగా ఉన్నాయంటే నోటితో చెప్ప‌లేని... చెవుల‌తో విన‌లేనంత దారుణంగా ఉంటున్నాయి. కొన్ని రోజుల క్రితం క‌న్న‌తండ్రే త‌న ఇద్ద‌రు కుమార్తెల‌పై యేళ్ల‌కు యేళ్లుగా అత్యాచారాలు చేసిన విష‌యాన్ని మ‌నం మ‌ర్చిపోలేం. ఇక ప్ర‌తి రోజు న్యూస్‌ల‌లో వివాహేత‌ర సంబంధాలు, చిన్నారుల‌పై రేప్‌ల లాంటి ఘోర సంఘ‌ట‌న‌ల గురించి వింటూనే ఉన్నాం. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో తండ్రే త‌న కుమార్తెను వ్య‌భిచారం రొంపిలోకి దింప‌డంతో పాటు ఆమెకు పెళ్ల‌య్యాక కూడా వ్య‌భిచారం చేయాల‌ని ఒత్తిడి చేయ‌డం సంచ‌ల‌నం రేపింది.


ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. గుంటూరులో నివాసం ఉండే ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మిట్టనోసుల ప్రభుదాసు ఎలియాస్‌ వీరారావు ఒక కుమార్తెను పెంచుకున్నాడు. పెంపుడు కుమార్తె అయినా ఆమెను క‌న్న కూతురులా చూసుకోవాల్సిన ప్ర‌భుదాసు ఆమెను ఓ వ్య‌భిచారిగా మార్చేశాడు. ఎలాంటి ప‌ని చేయ‌కుండా జ‌ల్సాలు చేస్తున్న ప్ర‌భుదాసుకు చివ‌ర‌కు కూతురిని వేరే వాళ్ల ద‌గ్గ‌ర ప‌డుకోపెట్టి ఆ వ‌చ్చిన డ‌బ్బుతో జ‌ల్సాలు చేసేవాడు.


ఈ క్ర‌మంలోనే ఆమె చేత 13 సంవత్సరాల వయస్సు నుంచే బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆమెకు వివాహం జరిగాక కూడా వ్యభిచారం చేయిస్తుండటంతో భర్త వదలివేశాడు. ఇలా కుమార్తెను భ‌ర్త‌కు దూరం చేశాడు. దీంతో ఆమె చిలకలూరిపేట పట్టణంలో తన కుమార్తెతో కలసి జీవనం కొనసాగిస్తోంది. అయినా కుమార్తెను వ‌ద‌ల‌ని ఆ క‌సాయి తండ్రి తిరిగి ఆమె ద‌గ్గ‌ర‌కు చేరాడు.


ఆమెను వ్యభిచారం చేయాల్సిందిగా కొట్టి గాయపరచటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ దారుణ సంఘ‌ట‌న‌పై మ‌హిళా సంఘాలు తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. త‌క్ష‌ణ‌మే నిందితుడు  అయిన ఆ క‌సాయి తండ్రిపై తీవ్రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: