తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ పార్టనర్స్ గురించి మనకు తెలుసు. ఒకప్పుడు పార్టనర్స్ గురించి మనకు తెలుసు. మరి అజ్ఞాత పార్టనర్ గురించి అయన చేసే అజ్ఞాన వ్యాఖ్యల గురించి వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా అజ్ఞాతవ్యక్తిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 


ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత 'అజ్ఞాత పార్టనర్'పై ధ్వజమెత్తారు. ఒకప్పుడు అమరావతి ప్రజా రాజధాని కాదు, తెలుగు దేశం పార్టీ రాజధాని అని గర్జించిన వ్యక్తి ఇప్పుడు రాజధానిని అక్కడి నుండి తిస్తె ఒప్పుకునేది లేదని అంటున్నారు' అని విమర్శించారు విజయసాయి రెడ్డి.


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''చంద్రబాబు 'అజ్ఞాత పార్ట్‌నర్‌' కూడా యూటర్నుల మాస్టర్‌ అయిపోయారు. నాడు అమరావతి ప్రజా రాజధాని కాదు, టీడీపీ రాజధాని అని గర్జించిన వ్యక్తి ఇప్పడు రాజధానిని అక్కడి నుంచి మారిస్తే ఒప్పుకునేది లేదంటున్నారు. మాటపై నిలబడలేని వారు రాజకీయాలను ఏం మారుస్తారు?'' అంటూ ట్విట్ చేసి అజ్ఞాత వ్యక్తి కోపం తెప్పిస్తున్నారు. 


ఆ అజ్ఞాత వ్యక్తి మాత్రమే కాకుండా అతని ఫ్యాన్స్ కి కూడా కోపం వచ్చేలా ట్విట్ చేశారు. మరి ఆ అజ్ఞాతవాసి బయటకు వచ్చి ఈ బహిరంగా వాసులపై గర్జిస్తారు ఏమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: