ప్రస్తుతం ప్రపంచంలో మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో ముందుంటున్నారు.  చిన్న ఉద్యోగాల నుంచి కార్పోరేట్ ఉద్యోగాల వరకు..కుటుంబ మహిళగా ఇంట్లో అన్ని పనులు చక్కదిద్దడం నుంచి అంతరిక్షం వరకు అన్నింటా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా భారత దేశంలో  తొలి మహిళా డీజీపీగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన కాంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2007 అక్టోబర్ 31న ఆమె రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్మాత కాంచన్ రాజకీయరంగంలో అడుగుపెట్టారు. 

కాంచన్ 1973 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి. 2004లో ఉత్తరాఖండ్ డీజీపీగా పదవీబాధ్యతలను చేపట్టి చరిత్ర సృష్టించారు.  రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రజా జీవితంలోనే ఉండాలని... చివరి శ్వాస వరకు దేశానికి సేవ చేయాలని ఆమె తపించారని అన్నారు. ఈ నేపథ్యంలో హరిద్వార్ నియోజకవర్గం నుంచి 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేశారు.

అయితే, ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు.   కాంచన్ మృతి నేపథ్యంలో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశ తొలి మహిళా డీజీపీ ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.  రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రజా జీవితంలోనే ఉండాలని... చివరి శ్వాస వరకు దేశానికి సేవ చేయాలని ఆమె తపించారని అన్నారు.

ఆమె మరణం తీరని లోటు అని ట్వీట్ చేశారు.గొప్ప నాయకత్వ లక్షణాలతో పాటు, మంచి హృదయం ఉన్న గొప్ప అధికారి ఆమె అని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి తీరని లోటని..ఉత్తరాఖండ్ పోలీసులు కాంచన్ మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో తొలి మహిళా డీజీపీ, రెండో మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అయిన కాంచన్ మరణం తమను ఎంతో ఆవేదనకు గురి చేస్తోందని పలువురు ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: