వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై ఘాటు విమర్శలు చేశారు. అతని గురించి అతనికే తెలియని నిజాలను విజయసాయి రెడ్డి అయన ట్విట్లతో తెలియజేశారు. ఎప్పుడు ట్విట్టర్ లో ఏదొక సంఘటన గురించి ట్విట్ చేసే విజయసాయి రెడ్డి ఈరోజు సుజనా చౌదరిపై మండిపడ్డారు. పదవి కోసం పార్టీ మారినా మీ గుండెల్లో ఇంకా చంద్రన్న ఉన్నట్టు ఉన్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు సుజనా చౌదరి.  


విజయ సాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'బిజెపీలో చేరినా మీ హృదయం నిండా చంద్రబాబు గారే ఉన్నారు. ఆయన కోవర్టుగానే కదా మీరు పార్టీ మారింది. మీ ప్రతి చర్యనూ బిజెపి గమనిస్తుందనే అనుకుంటున్నాను. బిజెపీలో చేరి వారి విధి విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడుతున్నారో తెలిసి పోతూనే ఉంది సుజనా చౌదరి.'  అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ 'సాయి గారు సుజనా చౌదరిది కండువా మాత్రమే మారింది, బ్లడ్ మారలేదు.. అస్సలు చెప్పాలంటే బీజేపీలోకి చేరామనిందే చంద్రబాబు నాయుడు. అలంటి చంద్రబాబుకి సపోర్ట్ గా మాట్లాడకుండా ఎలా ఉంటాడు అంటూ ఫైర్ అయ్యాడు ఓ నెటిజన్. మరి కొందరు స్పందిస్తూ 'చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సుజనా గుండెల్లో ఉంటాడు, కారణం అయన రక్తంలో ప్రవహించేది కమలం రక్తం కాదు పచ్చ రక్తం' అంటూ ట్విట్ చేసి ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.  


మరింత సమాచారం తెలుసుకోండి: